మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

వికారాబాద్ జిల్లాలో 27 ఏళ్ల మహిళా పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

By -  అంజి
Published on : 28 Feb 2026 11:46 AM IST

Woman constable found dead, Vikarabad, Telangana, Dharur Circle Inspector office

మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

వికారాబాద్ జిల్లాలో 27 ఏళ్ల మహిళా పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతురాలిని బలిజా దివ్యగా గుర్తించారు. ఫిబ్రవరి 28 శనివారం తెల్లవారుజామున గంగారామ్ సాయి బాబా కాలనీలోని తన నివాసంలో ఉరివేసుకుని మరణించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దివ్య కోట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ధరూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో అటాచ్ చేయబడింది.

కుటుంబ సభ్యులు ఆమె ఇంట్లో ఉరివేసుకుని ఉన్నట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వికారాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక తనిఖీలు నిర్వహించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేశారు. ఈ సంఘటన వెనుక గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. కుటుంబ వివాదాలు మరియు పని సంబంధిత ఒత్తిడి వంటి అనేక కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెలువడతాయి.

Next Story