హైదరాబాద్: గణేష్ విగ్రహాల తుది నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 6 గంటల నుండి సెప్టెంబర్ 7 సాయంత్రం 6 గంటల వరకు వైన్స్, కల్లు దుకాణాలు, బార్ల మూసివేయాలని ఎక్సైజ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అటు ఆదిలాబాద్లో ఈ నెల 4 నుంచి 6 తేదీల్లో ప్రాంతాల వారీగా వైన్స్ మూసివేయాలని స్థానిక అధికారులు ఆదేశించారు.
పెద్దపల్లితో పాటు పలు జిల్లాల్లో ఈ నెల 5న మద్యం దుకాణాలు మూసివేయాలని కలెక్టర్లు ప్రకటన విడుదల చేశారు. వినాయక నిమజ్జనంలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ డెసిషన్ ద్వారా నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు వీలవుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ ఆంక్షలు బార్ అండ్ రెస్టారెంట్లకు కూడా వర్తిస్తాయి. ఇక వైన్స్ బంద్ నిర్ణయం ఆయా జిల్లాల్లో నిమజ్జనం జరిగే తేదీలను బట్టి ఉండనుంది. గణేష్ నిమజ్జనం ఊరేగింపుల్లో మద్యం సేవించి గొడవలు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మద్యం విక్రయాలపై తాత్కాలికంగా నిషేధం విధించడం ఒక పరిష్కార మార్గమని అధికారులు భావిస్తున్నారు.