యాదాద్రి తరహాలో వేములవాడ అభివృద్ధి: మంత్రి కేటీఆర్

Vemulawada to be developed like Yadadri, says KTR. హైదరాబాద్: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడను యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం

By అంజి  Published on  7 Feb 2023 9:35 AM GMT
యాదాద్రి తరహాలో వేములవాడ అభివృద్ధి: మంత్రి కేటీఆర్

హైదరాబాద్: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడను యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం తరహాలో అభివృద్ధి చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రమేష్‌బాబుతో కలిసి మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేములవాడ ఆలయంలో జరిగే ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.

ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి ప్రత్యేకంగా అధికారులను ఆదేశించారు. పట్టణంలో ఉత్సవాల సందర్భంగా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముందుజాగ్రత్త చర్యగా అంబులెన్స్‌లు, అగ్నిమాపక సేవలను ఏర్పాటు చేయాలన్నారు. ఆలయంలో జాతరకు అన్ని ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు నిధులు మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు. ఇన్నేళ్ల లాగానే ఈ ఏడాది కూడా ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాన్నారు.

ఇందుకు రాష్ట్ర సాంస్కృతిక శాఖతో సక్రమంగా సమన్వయం ఉండాలని రాజన్న సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి తెలిపారు. సమీక్షా సమావేశంలో వేములవాడలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు మంత్రికి వివరించారు. యువత కోసం వేములవాడలో మినీ స్టేడియం నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. కోడారుపాక నుంచి వేములవాడ వరకు నాలుగు లైన్ల రహదారిని అభివృద్ధి చేయాలని, నాంపల్లి గుట్ట వద్ద రెండో ఘాట్‌ రోడ్డు నిర్మాణంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

సిరిసిల్ల, వేములవాడలు రాష్ట్రంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రాలుగా ఆవిర్భవిస్తాయని, తదనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని, వేములవాడ దేవస్థానం ట్యాంక్‌బండ్‌ను వరంగల్‌ తరహాలో బలోపేతం చేసి అభివృద్ధి చేయాలని సూచించారు. సిరిసిల్ల చివరలోని రామప్ప కొండపై శివుని ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేయబడుతుందన్నారు. అదేవిధంగా వేములవాడ టౌన్‌లోని నాంపల్లి గుట్టపై కూడా కేబుల్‌కార్‌ సర్వీసును ప్రవేశపెట్టనున్నారు. పట్టణంలోని ఆలయానికి వెళ్లే రహదారిలో చప్టాలు ఏర్పాటు చేయాలని, సాధ్యమైన ప్రదేశాలలో వీధి కళాఖండాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

"ప్రత్యేకమైన భవనాలతో నృత్య, సంగీత పాఠశాలలు స్థాపించబడతాయి. అవి రాజన్న ఆలయంతో అనుబంధించబడిన సాంస్కృతిక పాఠశాలకు అనుబంధంగా ఉంటాయి" అని కేటీఆర్‌ చెప్పారు. ములవాగు బండ్‌పై సైక్లింగ్‌, వాకింగ్‌ ట్రాక్‌లను అభివృద్ధి చేస్తామని, చెక్‌డ్యామ్‌లు నిర్మించడం ద్వారా మెరుగైన నీటి నిర్వహణ, పరిసరాలను కూడా సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

Next Story