Peddapalli: 8 ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న వంతెన.. ఈదురు గాలులకు కూలిపోవడంతో..

పెద్దపల్లి జిల్లాలో మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న వంతెనలో కొంత భాగం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సోమవారం అర్ధరాత్రి కూలిపోయింది.

By అంజి  Published on  23 April 2024 3:00 PM GMT
Peddapalli, bridge collapse, Telangana

Peddapalli: 8 ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న వంతెన.. ఈదురు గాలులకు కూలిపోవడంతో..

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న వంతెనలో కొంత భాగం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సోమవారం అర్ధరాత్రి కూలిపోయింది. ఈ ప్రాంతంలో భారీ వర్షం, బలమైన గాలుల మధ్య జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలను కలుపుతూ ఈ వంతెనను నిర్మిస్తున్నారు.

ముఖ్యంగా, రెండు జిల్లాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడం, రవాణాను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా రూ. 49 కోట్ల బడ్జెట్‌తో ఒక కిలోమీటరు పొడవైన వంతెనకు 2016లో శంకుస్థాపన చేశారు. అయితే, ప్రాజెక్ట్ ప్రారంభించి దాదాపు ఎనిమిదేళ్లు గడిచినా, అది అసంపూర్తిగానే ఉంది. ఓడేడు నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి గ్రామాన్ని కలిపేలా వంతెన నిర్మిస్తున్నారు.

ప్రాజెక్టులో అవకతవకలు జరగడంతో వంతెన నిర్మాణం ఆలస్యమైంది. పూర్తయిన పనులకు చెల్లింపులో జాప్యం జరగడంతో కొన్నేళ్లుగా నిర్మాణ పనులను కాంట్రాక్టర్ నిలిపివేసినట్లు సమాచారం.

Next Story