TSPSC Paper leak: సిట్ ఎదుట హాజరైన రేవంత్ రెడ్డి
టిఎస్పిఎస్సి పేపర్ లీక్ కేసును విచారిస్తున్న సిట్ ముందు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
By అంజి Published on 23 March 2023 3:07 PM IST
TSPSC Paper leak: సిట్ ఎదుట హాజరైన రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్పిఎస్సి) పేపర్ లీక్ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి గురువారం హాజరయ్యారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా సిట్ కార్యాలయానకి వెళ్లి పేపర్ లీక్ విషయమై నిరసనతో తెలపడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఈ కేసులో తాను చేసిన కొన్ని ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని సిట్ జారీ చేసిన సమన్లపై స్పందించిన కాంగ్రెస్ నాయకుడు సిట్ కార్యాలయంలో దర్యాప్తు అధికారుల ముందు హాజరయ్యారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) చీఫ్ తన మద్దతుదారుల ర్యాలీతో హిమాయత్ నగర్లోని సిట్ కార్యాలయం వైపు వెళుతుండగా, పోలీసులు వారిని లిబర్టీ క్రాస్రోడ్లో అడ్డుకున్నారు.
రేవంత్ రెడ్డి వెంట వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు లిబర్టీ నుంచి హిమాయత్ నగర్ వరకు రద్దీగా ఉండే రహదారిని మూసివేశారు. రేవంత్రెడ్డి కాన్వాయ్లోని వాహనాలను అనుమతించాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. అనంతరం రేవంత్ రెడ్డి తన మద్దతుదారులతో కలిసి హిమాయత్ నగర్లోని సిట్ కార్యాలయం వైపు పాదయాత్ర ప్రారంభించారు. కాంగ్రెస్ కార్యకర్తలు సిట్ కార్యాలయం వద్దకు చేరుకుని కార్యాలయం బయట కూర్చోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల అరెస్టులను కాంగ్రెస్ నేత ట్విటర్లో ఖండించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తమ ఎమ్మెల్సీ కె. కవితను ప్రశ్నించే సమయంలో ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం ముందు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) హై డ్రామా చేసిందని, అయితే తెలంగాణలో ప్రతిపక్షాల నిరసనలను బీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేస్తోందన్నారు.
"నా వాంగ్మూలాల ఆధారంగా టిఎస్పిఎస్సి పేపర్ లీక్పై సాక్ష్యం ఇవ్వడానికి ఈ రోజు సిట్ కార్యాలయంలో హాజరు కావాలని నన్ను కోరిన సందర్భంలో మా నాయకులు, క్యాడర్ను అరెస్టు చేయడం చాలా ఖండించదగినది" అని రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లాలో నిరసన తెలుపుతున్న సమయంలో సిఆర్పిసి సెక్షన్ 91 (పత్రం లేదా ఇతర వస్తువులను సమర్పించమని సమన్లు) రేవంత్కి మార్చి 23న హాజరు కావాలని, మార్చి 19న తాను చేసిన ఆరోపణలకు మద్దతుగా తన వద్ద ఉన్న ఆధారాలు, సమాచారాన్ని సమర్పించాలని సిట్ నోటీసు జారీ చేసింది.
పేపర్ లీక్లో రాష్ట్ర మంత్రి కెటి రామారావు వ్యక్తిగత సహాయకుడి హస్తం ఉందని టిపిసిసి చీఫ్ రేవంత్ ఆరోపించారు. కేటీఆర్కు చెందిన పీఏ తిరుపతి, నిందితుడు రాజశేఖర్రెడ్డిలు ఉన్న మండలానికి చెందిన అభ్యర్థులు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 103 మార్కులకు పైగా సాధించినట్లు సమాచారం.
ఇదేమి రాజ్యం! ఇదేమి రాజ్యం! దొంగల రాజ్యం దోపిడి రాజ్యం!లిబర్టీ చౌరస్తా వద్ద టీపీసీసీ చీఫ్, @revanth_anumula గారి వాహన శ్రేణిని నిలిపివేసిన పోలీసులు.కారు దిగి సిట్ కార్యాలయానికి నడుచుకుంటూ బయలిదేరిన టైగర్ రేవంత్ రెడ్డి! #RevanthReddy #tspscpaperleak @RamMohanINC pic.twitter.com/Z3E5n5glUK
— Telangana Congress (@INCTelangana) March 23, 2023
సిట్ కాదు... సీబీఐ విచారణ కావాల్సిందేటీఎస్పీఎస్సీ అక్రమాల పుట్ట అని తేలిపోయింది. పెద్దల హస్తం లేనిదే పరీక్ష పత్రాలు లీకేజీ సాధ్యం కాదని ప్రజలకు అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ – కేటీఆర్ అండ్ కో నియమించిన “సిట్” విచారణకు పిలిచింది. తప్పును ఎత్తి చూపడమే… pic.twitter.com/8XFq7HNSdu
— Revanth Reddy (@revanth_anumula) March 23, 2023