అందరికీ లీగల్ నోటీసులు ఇస్తా : జ‌గ్గారెడ్డి హెచ్చ‌రిక‌

తనపై అప్రతిష్ఠపాలు చేసే విదంగా పలు టీవీలలో, సోషల్ మీడియా లలో చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్న ఎలెక్ట్రానిక్ మీడియా టివిలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు

By Kalasani Durgapraveen  Published on  26 Oct 2024 9:51 AM GMT
అందరికీ లీగల్ నోటీసులు ఇస్తా : జ‌గ్గారెడ్డి హెచ్చ‌రిక‌

తనపై అప్రతిష్ఠపాలు చేసే విధంగా పలు టీవీలలో, సోషల్ మీడియాలలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాన‌ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హెచ్చ‌రించారు. గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. నేను గతంలో రెండేళ్ల క్రితం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మగ కలెక్టర్‌పై ప్రజా సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేశానని నేనే బహిరంగ సభలో చెప్పాను.. కానీ కొన్ని టీవీలలో నేను మహిళా కలెక్టర్ ను తిట్టినట్టు బూతులు మాట్లాడినట్లు కొన్ని టీవీలలో ప్రచారం చేస్తున్నారు.

ఇప్పుడు ఉన్న మహిళా కలెక్టర్‌ను నేను ఏమి అనలేదు.. గత కలెక్టర్‌ను నేను మాటలు అన్నానని నేను చెప్పిన మాటలను కూడా వక్రీకరిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దుష్ప్రచారం చేస్తున్న అందరికీ లీగల్ నోటీసులు ఇస్తాన‌ని తెలిపారు. బీఆర్ఎస్ టీవీలలో ఇతర టీవీలలో తనపై చేసిన తప్పుడు ప్రచారానికి మూల్యం చెల్లించక తప్పదు అన్నారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదిలేది లేదు అన్నారు.

Next Story