దోచుకున్న సొమ్ముతో కేసీఆర్‌ అక్కడికే పారిపోతారు : రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

TPCC President Revanth Reddy Sensational Comments On CM KCR. కేసీఆర్ తెలంగాణను చివరకు రోడ్లు అమ్ముకునే పరిస్థితికి తీసుకొచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  25 Jun 2023 8:37 AM GMT
దోచుకున్న సొమ్ముతో కేసీఆర్‌ అక్కడికే పారిపోతారు : రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కేసీఆర్ తెలంగాణను చివరకు రోడ్లు అమ్ముకునే పరిస్థితికి తీసుకొచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కు ఇష్టమైన ప్రాంతం దుబాయ్...దోచుకున్న సొమ్ముతో అక్కడికే పారిపోతారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ కుర్చీ కదులుతుందనే కేటీఆర్ ఢిల్లీలో గల్లీ గల్లీ ప్రదక్షిణలు చేస్తున్నార‌ని ఆరోపించారు. కేటీఆర్ పర్యటన కంటోన్మెంట్ రోడ్ల కోసమో, మెట్రో రైలు కోసమో, రాష్ట్ర ప్రయోజనాల కోసమో కాదని అన్నారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కంపెనీలపై ఐటీ దాడుల నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీ టూర్ వెళ్లారని అన్నారు.

ఐటీ దాడుల్లో చాలా రహస్య ఆస్తుల వివరాలు దొరికాయి. పత్రికల్లో, మీడియాలో రాకుండా కేటీఆర్ మేనేజ్ చేశారని అన్నారు. ఐటీ దాడుల్లో పట్టుకున్న ఆస్తులను విడిపించుకోవడానికి కేసీఆర్ మోదీకి లొంగిపోయారని అన్నారు. ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా.. తెలంగాణ గల్లీల్లో కేసీఆర్ ను ఎవరూ నమ్మరని కామెంట్ చేశారు. పదేళ్లు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారు. 100కోట్ల లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ పై విచారణ జరిపిస్తున్న మోదీ... లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ ను ఎందుకు విచారణ చేయడంలేదు? అని ప్ర‌శ్నించారు. బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధం అని అన్నారు. మీ ఢిల్లీ బీజేపీ నేతలు, కేసీఆర్ ఒక్కటే.. మీరు ఎంత కంఠశోష పెట్టుకున్నా మీ మాట ఎవరూ వినరు.. తెలంగాణకు పట్టిన చీడ వదలాలంటే ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే.. మీరందరూ కూడా కలిసి రండి అని బీజేపీ నేత‌ల‌కు పిలుపునిచ్చారు.


Next Story