అధికారంలోకి రాగానే సింగరేణి ఉద్యోగుల సమస్యల పరిష్కారం: రేవంత్‌

అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే సింగరేణి ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి గురువారం హామీ ఇచ్చారు.

By అంజి  Published on  19 Oct 2023 12:38 PM IST
Revanth Reddy, Singareni employees, Bhupalapally, Congress

అధికారంలోకి రాగానే సింగరేణి ఉద్యోగుల సమస్యల పరిష్కారం: రేవంత్‌

వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే సింగరేణి కొలీరీస్ కంపెనీ లిమిటెడ్ ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి గురువారం హామీ ఇచ్చారు. జయశంకర్‌ భూపాలపల్లి పట్టణంలో సింగరేణి కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వారి సమస్యలకు కారణమని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సింగరేణి ఉద్యోగులు చేసిన త్యాగాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరిచిపోయారని ఆరోపించారు.

సింగరేణి గనుల ప్రైవేటీకరణకు కేంద్రంలో బీఆర్‌ఎస్‌ అంగీకరించిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. "BRS పార్లమెంటులో గనుల బిల్లుకు మద్దతు ఇచ్చింది," అని ఆయన అన్నారు. ఒక అధికారి చాలా కాలం పాటు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించారు. సింగరేణి ఉద్యోగుల సంఘం ఎన్నికల నిర్వహణలో జాప్యం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి ఉద్యోగులు చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు.

‘‘ఉద్యమంలో పాల్గొనేందుకు మీరు అన్నీ పక్కన పెట్టేశారు. మీరు సకల జనుల సమ్మెలో పాల్గొనకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు’’ అని అన్నారు. అధికారంలో ఉండి ఉద్యోగుల పక్షాన ఉన్నామని చెబుతున్నప్పటికీ సింగరేణి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో బీఆర్‌ఎస్‌ విఫలమైందని కాంగ్రెస్‌ నేతలు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణకు మద్దతివ్వాలని సింగరేణి ఉద్యోగులకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పాల్గొనే విజయభేరి యాత్రలో భాగంగా టీపీసీసీ చీఫ్‌ భూపాలపల్లికి చేరుకున్నారు.

Next Story