ఇందిరమ్మ ఇళ్లు.. ఫిర్యాదులకు టోల్‌ ఫ్రీ నంబర్‌

ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రభుత్వం కాల్‌ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

By -  అంజి
Published on : 10 Sept 2025 7:46 AM IST

Toll free number, Indiramma Housing Scheme, Telangana, Minister Ponguleti Srinivasreddy

ఇందిరమ్మ ఇళ్లు.. ఫిర్యాదులకు టోల్‌ ఫ్రీ నంబర్‌

హైదరాబాద్‌: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రభుత్వం కాల్‌ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లోని హౌసింగ్‌ కార్పొరేషన్‌ హెడ్‌ ఆఫీసులో ఏర్పాటు చేసిన ఈ కాల్‌ సెంటర్‌ను ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. 1800 599 5991 టోల్‌ఫ్రీ నంబర్‌ ద్వారా లబ్ధిదారులు, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తారు.

రాష్ట్రం ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ, రాబోయే మూడేళ్లలోపు అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం తన పాలేరు నియోజకవర్గాన్ని సందర్శించిన మంత్రి, బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ₹8.15 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని, పేదలపై భారం మోపిందని ఆరోపించారని విమర్శించారు. బిఆర్ఎస్‌కు ఎటువంటి కమీషన్లు ఇవ్వకపోవడంతో పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని విస్మరించిందని, కాళేశ్వరం ప్రాజెక్టుకు వేల కోట్లు కుమ్మరించిందని ఆయన ఆరోపించారు.

అయితే ప్రస్తుత ప్రభుత్వం వీలైనంత త్వరగా ఇళ్లను నిర్మించడానికి కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే, రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయబడ్డాయి. అవి వివిధ దశలలో పూర్తవుతున్నాయని తెలిపారు. కూసుమంచి తహశీల్దార్ కార్యాలయంలో ఇసుక బజార్‌ను మంత్రి ప్రారంభించారు. “ఇందిరమ్మ గృహనిర్మాణ లబ్ధిదారులు ఇప్పుడు టన్నుకు ₹1,100 ధరకు గోదావరి ఇసుకను పొందవచ్చు, ఇతర అవసరాలకు టన్నుకు ₹1,300 ధరకు అందుబాటులో ఉంచుతామని” ఆయన ప్రకటించారు.

Next Story