'కాషాయ పాలనను అంతం చేయడమే.. జై మహాభారత్ లక్ష్యం'

The aim of Jai Mahabharat party is to end the rule of BJP. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో మహిళా అభ్యర్థులను నిలబెట్టాలని జై మహాభారత్ పార్టీ

By అంజి
Published on : 30 Sept 2022 10:11 AM IST

కాషాయ పాలనను అంతం చేయడమే.. జై మహాభారత్ లక్ష్యం

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో మహిళా అభ్యర్థులను నిలబెట్టాలని జై మహాభారత్ పార్టీ నిర్ణయించినట్లు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సుప్రీంకోర్టు న్యాయవాది భగవాన్ శ్రీ అనంత విష్ణు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలో బీసీ మహిళను పార్టీ బరిలోకి దించబోతోందని చెప్పారు. దేశంలో జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని, నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు, యువతకు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే అందరికీ విద్య, వైద్యం ఉచితంగా అందించేందుకు ప్రైవేట్‌ విద్యాసంస్థలు, ప్రైవేట్‌ ఆసుపత్రులను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటామన్నారు. నిరుద్యోగాన్ని అంతం చేసేందుకు తమ ప్రభుత్వం యువతకు ఉపాధి లేదా స్వయం ఉపాధి కల్పిస్తుందని ఆయన అన్నారు. మహిళలు కుటుంబ నిర్వాహకులని, రాజకీయంగా సాధికారత సాధించేందుకు మహిళలకు ఎన్నికల్లో సింహభాగం టిక్కెట్లు ఇస్తామని చెప్పారు.

తమ పార్టీ మేనిఫెస్టోలో నిరుపేదలకు 200 గజాల భూమి అందించడంతోపాటు ప్రజలు, దేశ భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. కార్పొరేట్లకు అనుకూల వ్యవహారం, నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జై మహాభారత్ పార్టీ ప్రధాన లక్ష్యం దేశంలో కాషాయ పాలనను అంతం చేయడమే. మునుగోడు నియోజకవర్గ ప్రజల భవిష్యత్తు కోసం తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని అనంత విష్ణు కోరారు.

Next Story