గ్రూప్-1 పరీక్షల నిర్వహణ.. ఆ ఆరోపణల్లో నిజం లేదు..హైకోర్టులో TGPSC

తెలంగాణ గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై న్యాయ విచారణ కోరుతూ దాఖలైన ఆరు రిట్ పిటిషన్లపై గురువారం తెలంగాణ హైకోర్టు విచారణ కొనసాగించింది

By Knakam Karthik
Published on : 4 July 2025 9:30 AM IST

Telangana, Tgpsc, Telangana High Court, Group-1 examination

గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై ఆరోపణల్లో నిజం లేదు..హైకోర్టులో TGPSC

తెలంగాణ గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై న్యాయ విచారణ కోరుతూ దాఖలైన ఆరు రిట్ పిటిషన్లపై గురువారం తెలంగాణ హైకోర్టు విచారణ కొనసాగించింది. టీజీపీఎస్సీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. ప్రాథమిక పరీక్షకు దాదాపు 4 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారని, వారిలో 30,000 మందిని మెయిన్స్‌కు షార్ట్‌లిస్ట్ చేశామని, చివరకు 20,161 మందిని ఎంపిక చేశామని తెలిపారు. పరీక్షల్లో విజయం సాధించని అభ్యర్థులు పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, సుప్రీంకోర్టు వాటిని రద్దు చేయడానికి నిరాకరించిందని, ఆరోపణలకు అర్హత లేదని, అవి దురుద్దేశంతో కూడినవని ఆయన ఎత్తి చూపారు.

పరీక్షల నిర్వహణలో చట్టబద్ధమైన నియమాల ఉల్లంఘన లేదా దుష్ప్రవర్తనకు ఆధారాలు లేవని నిరంజన్ రెడ్డి వాదించారు. క్రమబద్ధమైన లీకేజీలకు సంబంధించిన విశ్వసనీయ ఆరోపణలు లేవని, పరీక్షా కేంద్రాలు రాజీపడలేదని, పిటిషనర్లు TGPSC సమగ్రతను ప్రశ్నించలేదని లేదా ఏదైనా సెలెక్టివ్ వాల్యుయేషన్‌ను ఆరోపించలేదని ఆయన నొక్కి చెప్పారు.

తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం అభ్యర్థుల పట్ల కమిషన్ఎ ఎలాంటి వివక్ష చూపించలేదని, వారు సమాధానం రాసిన అంశాలను బట్టి నిపుణులు మార్కులు వేశారని కోర్టుకు తెలిపారు. కాగా కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్‌లో తెలుగు మీడియం అభ్యర్థుల సమాధాన పత్రాలు సరిగ్గా వాల్యుయేషన్ చేయలేదని, కోఠిలోని ఓ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసిన అభ్యర్థులే ఎక్కువమంది ఎంపిక అయ్యార ని కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్స్ దాఖలు చేశారు. మెయిన్స్ పరీక్షను పూర్తిగా రద్దు చేసి, మళ్ళీ పరీక్ష నిర్వహించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

Next Story