శివాజీ విగ్రహం ముందు వ్యక్తి మూత్ర విసర్జన.. గజ్వేల్‌లో ఉద్రిక్త పరిస్థితులు

గజ్వేల్ పట్టణంలో శివాజీ విగ్రహం వద్ద మూత్ర విసర్జన చేశాడనే ఆరోపణతో ఒక వ్యక్తిపై దాడి చేయడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది.

By అంజి  Published on  4 July 2023 3:14 PM IST
Telangana, Gajwel town, Urination front Shivaji idol, CM KCR

శివాజీ విగ్రహం ముందు వ్యక్తి మూత్ర విసర్జన.. గజ్వేల్‌లో ఉద్రిక్త పరిస్థితులు

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శివాజీ విగ్రహం వద్ద మూత్ర విసర్జన చేశాడనే ఆరోపణతో ఒక వ్యక్తిపై దాడి చేయడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి చేసిన పనికి, అతడిని నగ్నంగా ఊరేగించారు. ఈ సంఘటన వివిధ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలు కూడా అయ్యాయి. సమస్య సృష్టించిన వారిపై వెంటనే చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులను శాంతింపజేశారు.

ఈ ఘటనకు నిరసనగా, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గజ్వేల్‌లో కొన్ని సంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. స్థానిక పోలీసులు ఈ ఘటనను చూసి మౌనంగా ఉన్నారని మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబిటి) నాయకుడు అంజెదుల్లా ఖాన్ ఖలీద్ ఆరోపించారు. మైనారిటీ వర్గాలకు కూడా భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ, పోలీసు డైరెక్టర్ జనరల్, సిద్దిపేట కమిషనర్ విచారణకు ఆదేశించాలని కోరారు.

Next Story