'బిల్కిస్ బానోకు న్యాయం చేయాలి' అంటూ భారత్ జోడో యాత్రలో మహిళల పోరాటం

Telangana women join BJY demanding 'Justice for Bilkis Bano'. గురువారం తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లోని మక్తల్ నుండి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పునఃప్రారంభమైంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Oct 2022 11:00 AM GMT
బిల్కిస్ బానోకు న్యాయం చేయాలి అంటూ భారత్ జోడో యాత్రలో మహిళల పోరాటం

గురువారం తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లోని మక్తల్ నుండి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పునఃప్రారంభమైంది. ఈ యాత్రలో 'జస్టిస్ ఫర్ బిల్కిస్ బానో' నినాదాలు ఆకాశాన్ని తాకాయి. మహిళలు, ట్రాన్స్‌జెండర్ల కమిటీలో భాగమైన సజయ కాకర్ల, 'వేర్ ఆర్ ది ఉమెన్' బృందానికి చెందిన వర్షా భార్గవి ప్రజల దృష్టిని ఆకర్షించడానికి వారి దుస్తులపై 'జస్టిస్ ఫర్ బిల్కిస్ బానో' స్టిక్కర్‌లను అంటించుకున్నారు. భారత్ జోడో యాత్రలో 'జస్టిస్ ఫర్ బిల్కిస్ బానో' ప్రచారం చేస్తున్నామని.. అందులో భాగంగా స్టిక్కర్లను అంటించుకున్నామని.. న్యాయం జరిగే వరకూ తమ పోరాటం ఆగదని మహిళా కార్యకర్తలు తెలిపారు. మహిళా సంఘాలు బిల్కిస్ బానో అంశాన్ని లేవనెత్తి అన్యాయంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.

బిల్కిస్ బానో గాయాన్ని అణగదొక్కలేరని మహిళా సంఘాల సభ్యులు అన్నారు. "రేపిస్టులను ప్రభుత్వం విడుదల చేయడం సమాజంపైనా, మహిళల భద్రతపై చాలా ఘోరంగా ప్రతిబింబిస్తుంది. ఆడవాళ్లు ఇలాంటి ఘటనలపై ఆందోళన చెందుతున్నారని ప్రభుత్వం తెలుసుకోవాలని కోరుకుంటున్నాము" అని వర్ష భార్గవి అన్నారు. సెప్టెంబరులో, వర్ష నేతృత్వంలోని బృందం ఈ సమస్యపై ప్రజల దృష్టిని ఆకర్షించడానికి హైదరాబాద్‌లో హెన్నా టాటూ ప్రచారాన్ని ప్రారంభించింది. దాదాపు 20 మంది పురుషులు, మహిళలు 'జస్టిస్ ఫర్ బిల్కిస్ బానో' అని టాటూ వేయించుకున్నారు.

2002 గుజరాత్‌ అల్లర్ల సందర్భంగా బిల్కిస్‌ బానో ఇంట్లో చొరబడి ఆమెపై లైంగికదాడి చేసిన 11 మందిని గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల రెమిషన్‌పై విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, దోషులను జైలుకు పంపాలనే డిమాండ్‌ దేశ వ్యాప్తంగా మొదలైంది. 2002లో, గోద్రా అల్లర్ల తర్వాత గుజరాత్‌లో మతపరమైన అల్లర్లు చెలరేగాయి. ఆ తర్వాత జరిగిన అల్లర్లలో 1,000 మందికి పైగా మరణించారు. ఈ అల్లర్లలో బిల్కిస్ బానో కుటుంబ సభ్యులు 14 మంది హత్యకు గురయ్యారు. బానోకు అప్పుడు 19 ఏళ్లు మరియు గర్భవతి, ఆమె గ్రామానికి చెందిన 11 మంది వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి చనిపోతుందని భావించి వదిలివేశారు. అయితే, ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆరేళ్ల తర్వాత, సామూహిక అత్యాచారం, హత్య కేసులో 11 మంది నిందితులకు జీవిత ఖైదు విధించబడింది.

ఆగస్టు 15, 2022న, గుజరాత్ ప్రభుత్వం తన ఉపశమన విధానం ప్రకారం మొత్తం 11 మంది దోషులు గోద్రా జైలు నుండి విడుదలయ్యారు. గుజరాత్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో దోషుల శిక్షను తగ్గించడాన్ని పోలీసు సూపరింటెండెంట్, సీబీఐ, స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ ముంబై, స్పెషల్ జడ్జి (సీబీఐ) వ్యతిరేకించారు. అయితే, MHA వారిని ముందస్తుగా విడుదల చేయాలని కోరింది.

Next Story