Telangana: మొక్కజొన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు

మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించిన నగదును ప్రభుత్వం నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. 55,904 మంది అన్నదాలకు రూ.585 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.

By -  అంజి
Published on : 12 Dec 2025 12:08 PM IST

Telangana, maize procurement, Minister Tummala Nageshwar Rao, agriculture

మొక్కజొన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు

హైదరాబాద్‌: మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించిన నగదును ప్రభుత్వం నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. 55,904 మంది అన్నదాలకు రూ.585 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు 2.45 లక్షల మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్నను ప్రభుత్వం సేకరించింది. క్వింటాకు రూ.2,400 చొప్పున అందజేయనుంది. కాగా కేంద్రం సహకరించకపోయినా రైతులు నష్టోకూడదని తామే పంటను సేకరిస్తున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

మొక్కజొన్న కొనుగోళ్లకు రూ.588 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించారు. శుక్రవారం నుంచి ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయ మంత్రి తెలిపారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తమ ఉత్పత్తులను సరఫరా చేసిన 55,904 మంది రైతుల ఖాతాలకు నేరుగా ఈ మొత్తాన్ని బదిలీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి తుమ్మల తెలిపారు.

కేంద్రం నుండి ఎటువంటి మద్దతు లభించకపోయినా , రైతులు నష్టపోకుండా చూసుకోవడానికి తెలంగాణ మొక్కజొన్న సేకరణను చేపట్టిందని ఆయన అన్నారు. ఇప్పటివరకు తెలంగాణ 2.45 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను సేకరించింది. రైతుల ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కష్టాలను నివారించడానికి అవసరమైనప్పుడల్లా జోక్యం చేసుకుంటూనే ఉంటుందని తుమ్మల ఒక ప్రకటనలో తెలిపారు.

Next Story