సైబర్‌ నేరాల్లో.. ఫస్ట్‌ ప్లేస్‌లో తెలంగాణ

Telangana state ranks first in cybercrimes. సైబర్‌ క్రైమ్‌ కేసుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) విడుదల

By అంజి  Published on  29 Aug 2022 7:12 AM GMT
సైబర్‌ నేరాల్లో.. ఫస్ట్‌ ప్లేస్‌లో తెలంగాణ

సైబర్‌ క్రైమ్‌ కేసుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) విడుదల చేసిన 'క్రైమ్ ఇన్ ఇండియా-2021' నివేదిక ప్రకారం, 2021లో రాష్ట్రంలో 10,303 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. 2020లో వాటి సంఖ్య 5,024గా ఉంది.

2019తో పోలిస్తే 2020లో రాష్ట్రంలో 86 శాతం (5,024 కేసులు) పెరిగాయి. సైబర్ నేరాలలో ఎక్కువ భాగం (7,003) 'కమ్యూనికేషన్ పరికరాలను మాధ్యమంగా కలిగి ఉన్న' మోసానికి సంబంధించినవే. అలాగే ఆర్థిక నేరాల విషయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. ఇది 2020తో పోలిస్తే 2021లో 60 శాతం పెరిగింది.

రాష్ట్రంలో 2021లో మొత్తం 10,303 సైబర్ క్రైమ్ కేసుల్లో 8,690 సైబర్ నేరాలు (ఆర్థిక నేరాలు) మోసానికి సంబంధించినవి (ఆర్థిక నేరాలు). రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి రెండు సైబర్ నేరాలు కూడా నమోదయ్యాయి. 2021లో మహిళలపై నేరాల్లో తెలంగాణ 17 శాతానికి పైగా పెరిగి దేశంలో ఎనిమిదో స్థానంలో నిలిచిందని డేటా వెల్లడించింది. మహిళలపై నేరాలకు సంబంధించి IPC 498A సెక్షన్‌ ప్రకారం.. 20,865 కేసుల్లో 45 శాతం భర్తల క్రూరత్వానికి సంబంధించినవే.

తెలంగాణలో 823 అత్యాచార కేసులు నమోదవగా.. కేటగిరీలో 12వ స్థానంలో నిలిచింది. 2020తో పోల్చితే 2021లో 21 శాతం పెరుగుదలతో సీనియర్ సిటిజన్‌లపై జరిగిన నేరాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది.

Next Story