హైదరాబాద్: 2025- 26 ఆర్థిక సంవత్సర బడ్జెట్కు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కాసేపట్లో అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు నల్లపోచమ్మ గుడిలో బడ్జెట్ ప్రతులను ఉంచి భట్టి ప్రత్యేక పూజలు చేయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. కాగా బడ్జెట్ రూ.3 లక్షల కోట్లకుపైగా ఉండొచ్చని అంచనా.