TSRTC: ప్రజలకు మరింత చేరువగా టీ-9 టికెట్‌

ప్రజలు, సిబ్బంది నుండి వారం రోజుల్లో సానుకూల స్పందన రావడంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) అధికారులు టీ-9

By అంజి
Published on : 25 Jun 2023 5:23 AM

TSRTC, T-9 ticket offer, Telangana, Pallevelugu

TSRTC: ప్రజలకు మరింత చేరువగా టీ-9 టికెట్‌ 

హైదరాబాద్: ప్రజలు, సిబ్బంది నుండి వారం రోజుల్లో సానుకూల స్పందన రావడంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) అధికారులు 'టీ-9 టిక్కెట్' ఆఫర్‌ను అన్ని వర్గాల ప్రజలకు విస్తరించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. జూన్ 18 నుంచి రాష్ట్రంలోని 'పల్లె వెలుగు' బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్‌ల కోసం ప్రత్యేకంగా 'టీ-9 టిక్కెట్'ను ఆర్టీసీ ప్రవేశపెట్టింది. ఈ టికెట్‌ ధర రూ. 100. ఈ టిక్కెట్‌లు ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు చెల్లుబాటు అవుతాయి. ఈ టికెట్లతో ప్రయాణికులు 60 కిలోమీటర్ల లోపు ప్రయాణం చేయొచ్చు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఆఫర్‌ను గత వారం ప్రారంభించినప్పటి నుండి అన్ని విభాగాలలోని బస్సు వినియోగదారుల నుండి, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నివసించే వారి నుండి మంచి స్పందన వచ్చింది. ఈ ఆఫర్‌ను పురుషులకు పొడిగించాలని, ప్రయాణానికి చెల్లుబాటు అయ్యే గంటలను పెంచాలని పలువురు పౌరులు ఆర్టీసీని కోరుతున్నారు. "ఈ టిక్కెట్‌తో బస్సులలో ప్రయాణించేటప్పుడు ప్రయాణీకుడు రూ. 20 నుంచి రూ. 40 మధ్య ఆదా చేసుకోగలడు" అని టిఎస్‌ఆర్‌టిసి సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇది ఆఫర్‌లో చేర్చమని కోరుతూ ఇతరుల నుండి భారీ డిమాండ్‌కు దారితీసింది.

టికెట్ ఆఫర్‌పై ప్రజల స్పందనపై ఇటీవల సిబ్బంది నుండి అభిప్రాయాన్ని సేకరించిన సీనియర్ అధికారులు, ఇప్పుడు దీనిని సాధారణ ప్రజలకు కూడా విస్తరించాలని యోచిస్తున్నారు. అయితే టికెట్‌ ఛార్జీలు, ప్రయాణ గంటలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ టిక్కెట్‌కి సంబంధించిన వివరాల కోసం పౌరులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్‌లను 040-69440000 లేదా 040-23450033ను సంప్రదించవచ్చు.

గ్రామ బస్ అధికారులు

ప్రజా రవాణా వ్యవస్థను పౌరులకు మరింత చేరువ చేసేందుకు ఇటీవల నియమితులైన విలేజ్ బస్ అధికారులు, ఆర్టీసీపై పలు అవగాహన కార్యక్రమాలు, ప్రదర్శనలతో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లోకి రావడం ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ రేటును పెంచే T-9, T-24, T-6, F-24 టిక్కెట్ ఆఫర్‌లపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. బృందాలు గ్రామాల్లో పర్యటిస్తూ 'డప్పు'ను ఉపయోగిస్తూ, అలాగే ఇతర పబ్లిక్ అడ్రస్ సిస్టంల ద్వారా ప్రకటనలు చేస్తున్నారు.

"గ్రామ బస్ అధికారులు బస్సులను ఉపయోగించడం పట్ల ప్రజలను ఆకర్షించడంలో, ప్రయాణీకుల సౌకర్యార్థం చేపట్టిన వివిధ పౌర స్నేహపూర్వక కార్యక్రమాలపై అవగాహన కల్పించడంలో విజయం సాధించారు" అని ఒక అధికారి తెలిపారు.

Next Story