బిగ్ షాక్ ఇచ్చిన TGRTC..బస్ పాస్ ధరలు పెంపు

బస్ పాస్ ధరలను పెంచుతూ తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చింది.

By Knakam Karthik
Published on : 9 Jun 2025 2:23 PM IST

Telangana, RTC, increases bus pass rates

బిగ్ షాక్ ఇచ్చిన TGRTC..బస్ పాస్ ధరలు పెంపు

బస్ పాస్ ధరలను పెంచుతూ తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చింది. సాధారణ ప్రజలతో పాటు విద్యార్థుల పాస్ ధరలను కూడా పెంచింది. నేటి నుంచి కొత్త బస్ పాస్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. అయితే ఛార్జీలను ఏకంగా 20 శాతానికి పెంచారు. రూ.1,150 ఉన్న ఆర్డినరీ పాస్‌ ధరను రూ.1,400కు పెంచారు. రూ.1,300 ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్‌ పాస్‌ ధరను రూ.1,600కు పెంచారు. రూ.1,450 ఉన్న మెట్రో డీలక్స్‌ పాస్‌ను రూ.1,800కు పెంచారు. గ్రేటర్‌ హైదరాబాద్‌, గ్రీన్‌ మెట్రో ఏసీ పాస్‌ ధరలను ఆర్టీసీ పెంచింది.

ఇక ఇటీవల హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలను కూడా పెంచారు. ఏడున్నరేళ్ల తర్వాత తొలిసారిగా ధరల పెంపును L&T మెట్రో రైల్ లిమిటెడ్ మే 17 నుంచి అమలులోకి తెచ్చింది. ముందుగా 20 శాతం టికెట్ ధరలను పెంచారు. అయితే ప్రయాణికుల నుంచి వచ్చిన వ్యతిరేకత, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పెరిగిన ధరలపై 10 శాతం రాయితీని మే 24 నుంచి ప్రకటించింది. దీంతో చాలా మంది మెట్రోకు బదులుగా బస్సుల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో బస్ పాస్ ఛార్జీలు కూడా పెంచటంతో సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story