Telangana Polls: కామారెడ్డి నుంచి రేవంత్‌.. కాంగ్రెస్‌ థర్డ్‌ లిస్ట్‌ వచ్చేది అప్పుడే?

నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 45 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ శుక్రవారం విడుదల చేసింది.

By అంజి  Published on  28 Oct 2023 2:01 AM GMT
Telangana Polls, Revanth , Kamareddy, Congress third list

Telangana Polls: కామారెడ్డి నుంచి రేవంత్‌.. కాంగ్రెస్‌ థర్డ్‌ లిస్ట్‌ వచ్చేది అప్పుడే?

నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 45 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ శుక్రవారం విడుదల చేసింది. దీంతో మొత్తం 119 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 100 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. అక్టోబర్ 15న 55 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. ఇక నవంబర్ 2 నాటికి మిగిలిన 19 స్థానాలకు మూడో జాబితా విడుదల చేయనుందని పార్టీ వర్గాల నుంచి సమాచారం. రెండో జాబితాలో ఎనిమిది మంది బీసీ అభ్యర్థులు, రెడ్డి సామాజికవర్గం నుంచి 22 మంది, కమ్మ సామాజికవర్గం నుంచి ముగ్గురు, బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి ఒకరు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు. కామారెడ్డిలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, సిరిసిల్లలో ఐటీ శాఖ మంత్రి కె.టి.రామారావు పోటీ ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ కాంగ్రెస్‌లో కొనసాగింది.

ఇప్పటికే తొలి జాబితాలో రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన కొడంగల్‌తో పాటు కామారెడ్డిలో టీపీసీసీ చీఫ్ ఎ. రేవంత్ రెడ్డిని పార్టీ బరిలోకి దింపవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ అర్బన్ సీటును కాంగ్రెస్ పెండింగ్‌లో ఉంచుతోంది. ఆయన సొంత నియోజకవర్గం కామారెడ్డి స్థానంలో షబ్బీర్ అలీని బరిలోకి దించాలని భావిస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డిని కామారెడ్డి నుంచి బరిలోకి దించవచ్చనే ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ఇక కాంగ్రెస్ 15 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను విడుదల చేస్తుందని, సీపీఐ, సీపీఎంలకు రెండ్రోడు స్థానాలు కేటాయిస్తూ ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత వామపక్షాలకు నాలుగు స్థానాలు కేటాయించాలని భావిస్తోందని తెలుస్తోంది.

వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో కాంగ్రెస్‌కు పెద్ద బూస్ట్‌గా, అధికార బిఆర్‌ఎస్, బిజెపికి చెందిన ఎనిమిది మంది నాయకులు శుక్రవారం పార్టీలో చేరారు. రెండు రోజుల క్రితం బీజేపీని వీడిన మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత మోత్కుపల్లి నరసింహులు ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఅర్జున్‌ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ ఇంచార్జి జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్, మాణికరావు ఠాక్రే, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి, సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన ఇతర నాయకులు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, నీలం మధు ఉన్నారు. గత ఏడాది కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన రాజ్‌గోపాల్‌రెడ్డికి ఇది ఊరట. ఉప ఎన్నిక కోసం బలవంతంగా అసెంబ్లీకి రాజీనామా చేసిన ఆయన బిజెపి టిక్కెట్‌పై తిరిగి ఎన్నికవ్వడంలో విఫలమయ్యారు. మాజీ ఎంపీ రాజ్ గోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు. ఆయన రాకతో అవిభాజ్య నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ మరింత బలపడుతుంది.

Next Story