దివ్యాంగులను పెళ్లి చేసుకున్నవారికి ప్రోత్సాహకం పెంపు

దివ్యాంగులకు సీఎం రేవంత్‌ సర్కార్‌ మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. దివ్యాంగులను పెళ్లి చేసుకున్న వారికి ఇచ్చే ప్రోత్సాహకాలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By అంజి
Published on : 21 May 2025 1:47 AM

Telangana Govt, 1 Lakh incentive, marriage, disabilities

దివ్యాంగులను పెళ్లి చేసుకున్నవారికి ప్రోత్సాహకం పెంపు

హైదరాబాద్‌: దివ్యాంగులకు సీఎం రేవంత్‌ సర్కార్‌ మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. దివ్యాంగులను పెళ్లి చేసుకున్న వారికి ఇచ్చే ప్రోత్సాహకాలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రూ.50 వేలుగా ఉన్న ప్రోత్సాహక సాయాన్ని రూ.లక్షకు పెంచుతున్నట్టు తెలిపింది. అలాగే, ఇక నుంచి ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నా ఈ ప్రోత్సాహకం వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం (మే 19, 2025) మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేశారు.

మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి దానసరి అనసూయ (సీతక్క).. దివ్యాంగులను పెళ్లి చేసుకున్నవారికి ప్రోత్సాహకం పెంపు విషయంలో ప్రత్యేక కృషి చేశారు. ప్రోత్సాహకం భార్య పేరు మీద ఇవ్వబడుతుంది. ఈ నిర్ణయం మునుపటి పథకం నుండి మార్పును సూచిస్తుంది. గతంలో, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ వివాహ ప్రోత్సాహక పథకానికి మార్గదర్శకాలను జారీ చేసింది. భాగస్వాములలో ఒకరు వికలాంగుడు,మరొకరు వికలాంగుడు కాని జంటలకు రూ.1 లక్ష అందిస్తుంది.

Next Story