తెలంగాణలో నవజాత శిశువులకు శిశు ఆధార్‌ కార్డుల జారీ

Telangana govt issues Shishu Aadhar for newborns at public hospitals. హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో నవజాత శిశువులకు తెలంగాణ ప్రభుత్వం శిశు ఆధార్ కార్డుల

By అంజి  Published on  14 Dec 2022 4:37 AM GMT
తెలంగాణలో నవజాత శిశువులకు శిశు ఆధార్‌ కార్డుల జారీ

హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో నవజాత శిశువులకు తెలంగాణ ప్రభుత్వం శిశు ఆధార్ కార్డుల జారీని ప్రారంభించింది. ఈ చొరవ శిశువుల కోసం ఒక గుర్తింపును రూపొందించడంలో సహాయపడే లక్ష్యంతో ఉంది. గోల్కొండ ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహ్మద్ మజరుల్లా మాట్లాడుతూ.. తెలంగాణలో నవజాత శిశువుల కోసం తెలంగాణ ప్రభుత్వం శిశు ఆధార్ కార్డులను మంజూరు చేస్తోంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలోని ప్రభుత్వ కుటుంబ సంక్షేమ కమిషన్‌ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.

నవజాత శిశువుల కోసం శిశు ఆధార్‌ కార్డులను నమోదు చేస్తున్నారు. ఇందుకు తల్లి ఆధార్ కార్డు, ఆధార్ నంబర్ తప్పనిసరి అని తెలిపారు. లేని పక్షంలో తండ్రి ఆధార్ కార్డు కూడా వినియోగించుకోవచ్చు. ''మేము శిశు ఆధార్‌ కార్డును బిడ్డ పుట్టిన 24 గంటల్లోపు జారీ చేస్తాము. తెలంగాణలో తొలిసారిగా దీన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎంకు, ఆరోగ్య శాఖ మంత్రికి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను'' అని డాక్టర్ మహ్మద్ మజరుల్లా అన్నారు.

గోల్కొండ ఏరియా ఆస్పత్రి డీఈవో సాయిబాబా మాట్లాడుతూ.. 'శిశు ఆధార్ కార్డు' కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే దీన్ని అమలు చేశారు. శిశువులు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే ముందు ఆధార్ కార్డులను జారీ చేస్తారు. పెషేంట్ల వద్దకు వెళ్లి వారి ముందు ఆన్‌లైన్‌లో ఆధార్‌ను అప్లై చేస్తున్నాం. వారు 15 రోజుల్లోగా కార్డును ఆన్‌లైన్‌లో తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వారికి 45 రోజుల్లోగా పోస్ట్ ద్వారా కార్డు అందుతుంది. ఈ కార్యక్రమం ప్రారంభించి 6 నెలలు అవుతోంది. పైలట్ ప్రోగ్రామ్‌గా మొదటి దశలో 45 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండో దశకు కూడా శ్రీకారం చుట్టింది. నవంబర్ నుండి ఈ కార్యక్రమం కింద మేము ఇప్పటికే దాదాపు 30 ఆధార్ కార్డులను జారీ చేసాము అని చెప్పారు.

లబ్ది పొందిన నవజాత శిశువు తల్లి స్రవంతి మాట్లాడుతూ.. ''ప్రతి ఒక్కరూ ఈ ప్రయోజనం కోసం ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని నేను సూచిస్తున్నాను. మేము దీన్ని పొందుతున్నందుకు సంతోషంగా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు.'' అని చెప్పారు. మరో లబ్ధిదారుడి బిడ్డ తల్లి అఫ్రీన్ జబిన్ మాట్లాడుతూ.. ''నాకు 4 రోజుల క్రితం ఆడపిల్ల పుట్టింది. నా బిడ్డ కోసం ఆధార్ కార్డు తయారు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు'' అని అన్నారు.

Next Story