అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. మహిళా జర్నలిస్టులను సత్కరించిన తెలంగాణ సర్కార్‌

Telangana govt felicitates women journalists on the eve of International Women's Day. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని మాధ్యమాలకు చెందిన మహిళా

By అంజి  Published on  8 March 2022 3:57 AM GMT
అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. మహిళా జర్నలిస్టులను సత్కరించిన తెలంగాణ సర్కార్‌

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని మాధ్యమాలకు చెందిన మహిళా జర్నలిస్టులను సత్కరించింది. తెలంగాణకు చెందిన మహిళా జర్నలిస్టులు ఇప్పటి వరకు చేసిన ఆదర్శప్రాయమైన కృషిని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రశంసించారు. తన జీవితంలో మహిళలు పోషించిన పాత్ర గురించి, తన వ్యక్తిగత జీవిత అనుభవాలను వివరించారు. కేటీఆర్‌ మాట్లాడుతూ.. "భారతీయ పురుషులు మన ఇళ్లను విడిచిపెట్టి ఒంటరిగా జీవించడం ప్రారంభించినప్పుడే మన జీవితంలో స్త్రీ యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తారు. నేను ఇల్లు వదిలి నా స్వంతంగా ఉండడం ప్రారంభించినప్పుడు మా అమ్మ చేసే పనిని నేను నేర్చుకున్నాను. మహిళలు మల్టీ టాస్కర్లు, కార్యాలయంలో ఎక్కువ గంటలు పని చేస్తారు. ఇంటికి తిరిగి వెళ్లి కుటుంబాన్ని చూసుకుంటారు. సమాజం ఎదగాలని మనం నిజంగా కోరుకుంటే, ఈ వాస్తవికత మారాలి అని అన్నారు.

ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రింట్, డిజిటల్, టీవీ మీడియాకు చెందిన దాదాపు 80 మంది మహిళా జర్నలిస్టులు జర్నలిజానికి చేసిన సేవలకు గాను అవార్డులు పొందారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా హాజరయ్యారు. మహిళల జీవితాలను మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించారు. ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్ కిట్లు, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు వంటి కార్యక్రమాలు తెలంగాణలో మహిళలు తమ జీవితంలో ఎదగడానికి వీలు కల్పిస్తున్నాయి. ఈ సందర్భంగా అన్ని మీడియా సంస్థలకు చెందిన 80 మంది మహిళా జర్నలిస్టులు ఘనంగా సత్కరించారు.

న్యూస్ మీటర్‌ తెలుగు ఎడిటర్ నెల్లుట్ల కవిత

Next Story