హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ వేడుకలకు అతిథులుగా జపాన్లోని కితాక్యూషూ నగర మేయర్ కజుహిసా టకేచీ ప్రతినిధి బృందం హాజరుకానుంది. ఇక జిల్లాల్లో ఇప్పటికే ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, విప్లు, ఇతర ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. కాగా రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఇటీవల జపాన్ పర్యటనకు వెళ్లిన సీఎం వారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రభుత్వం నిర్మించనున్న ప్యూచర్ సిటీని కాలుష్య రహితంగా నిర్మించడంలో వారి సహకారం తీసుకోనుంది. ఆవిర్భావ వేడుకల అనంతరం.. తెలంగాణ, కితాక్యూషు ఐటీసీ కాకతీయ హోటల్లో పరస్పర సహకార ఒప్పందంపై సంతకం చేస్తాయి. కితాక్యూషు ఒకప్పుడు జపాన్లో అత్యంత కాలుష్య నగరంగా ఉండేది, కానీ ఇప్పుడు దానిని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా మార్చారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, పోలీసు, అగ్నిమాపక సిబ్బందిలో వారి అసాధారణ సేవ, ధైర్యం, నిబద్ధతను గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వం 461 మంది అధికారులకు వార్షిక 'పథకం' అవార్డులను ప్రకటించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలంగాణ పోలీస్ శౌర్య పతకము, ధైర్యసాహసాలకు ప్రదానం చేయబడుతుంది. ఈ అవార్డు ఎలైట్ గ్రేహౌండ్స్ యూనిట్ నుండి Ch. మహేష్, G. శోభన్, A. రాకేష్ కుమార్ లకు దక్కనుంది.