తెలంగాణ రైతులకు శుభవార్త..వ్యవసాయం కోసం ప్రత్యేకంగా మూడవ డిస్కం 'TGRPDCL' ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్ సరఫరాను అందించే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకుంది.

By -  Knakam Karthik
Published on : 11 March 2026 7:46 PM IST

Telangana, TGRPDCL, Agriculture News, Free Power, Discoms, Rythu Sankshemam, Telangana Government

తెలంగాణ రైతులకు శుభవార్త..వ్యవసాయం కోసం ప్రత్యేకంగా మూడవ డిస్కం 'TGRPDCL' ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్ సరఫరాను అందించే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా 'తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ' (TGRPDCL) పేరుతో మూడవ డిస్కంను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం ఉన్న డిస్కంలపై భారం తగ్గించి, రైతులకు నిరంతరాయంగా ఉచిత మరియు నాణ్యమైన విద్యుత్ అందించడంపై ఈ సంస్థ ప్రత్యేక దృష్టి సారించనుంది. ఈ నిర్ణయంతో రైతుల అవసరాలకు తగిన ప్రాధాన్యత లభించడమే కాకుండా, వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.

Next Story