Telangana: మెడికల్ షాపులపై డీసీఏ దాడులు.. తప్పుడు మందులు స్వాధీనం
తమ లేబుల్లపై తప్పుదారి పట్టించే క్లెయిమ్లను పేర్కొంటూ మెడికల్ షాపుల్లో అమ్ముతున్న కొన్ని ఆయుర్వేద మందులను తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సీజ్ చేసింది.
By అంజి Published on 28 July 2024 4:48 PM IST
Telangana: మెడికల్ షాపులపై డీసీఏ దాడులు.. తప్పుడు మందులు స్వాధీనం
హైదరాబాద్: తమ లేబుల్లపై తప్పుదారి పట్టించే క్లెయిమ్లను పేర్కొంటూ మెడికల్ షాపుల్లో అమ్ముతున్న కొన్ని ఆయుర్వేద మందులను తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) సీజ్ చేసింది. స్వాధీనం చేసుకున్న మందులలో త్రిఫల గుగ్గులు మాత్రలు, అశ్వగంధాది లేహ్య వంటి లేబుల్లు ఉన్నాయి. ఇవి వరుసగా ఊబకాయం, డిప్రెషన్ - సంబంధిత ఆందోళనకు చికిత్సలుగా ప్రచారం చేయబడ్డాయి.
కేసు వివరాలు
ఈ మందులను విక్రయిస్తున్న మెడికల్ షాపులు, ఔట్లెట్లపై శనివారం డీసీఏ అధికారులు వివిధ జిల్లాల్లో దాడులు నిర్వహించారు.
యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని ఒక మెడికల్ షాపులో సిద్ధ్-ఆయు ఆయుర్వేదిక్ రీసెర్చ్ ఫౌండేషన్ తయారు చేసిన మొదటి ఉత్పత్తి, త్రిఫల గుగ్గులు టాబ్లెట్లు కనుగొనబడ్డాయి. ఉత్పత్తిపై ఉన్న లేబుల్ ఊబకాయానికి చికిత్స చేయగలదని పేర్కొంది. అయితే అది తప్పుదారి పట్టించేదిగా డీసీఏ గుర్తించింది.
అదేవిధంగా విజయవాడలోని మన్ఫర్ ఆయుర్వేదిక్ డ్రగ్స్ ఉత్పత్తి చేసిన అశ్వగంధాది లేహ్యను సిరిసిల్లలోని ఓ మెడికల్ షాపులో గుర్తించారు. ఉత్పత్తి డిప్రెషన్, సంబంధిత ఆందోళన నుండి ఉపశమనం కలిగిస్తుందని లేబుల్ చేసింది. ఇది డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనలు) చట్టం, 1954 ప్రకారం నిషేధించబడిన క్లెయిమ్ల పరిధిలోకి వస్తుంది.
చట్టపరమైన చర్యలు
డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అభ్యంతరకరమైన ప్రకటనలు) చట్టం 1954 ప్రకారం.. స్థూలకాయం, డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య పరిస్థితులతో సహా కొన్ని వ్యాధులు, రుగ్మతల చికిత్స కోసం ప్రకటనల మందులను నిషేధించింది.
తప్పుడు క్లెయిమ్ల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించకుండా నిరోధించడం, శాస్త్రీయంగా నిరూపితమైన చికిత్సలు మాత్రమే ప్రచారం చేయబడేలా చేయడం ఈ చట్టం లక్ష్యం.
డ్రగ్స్ ఇన్స్పెక్టర్ జె అశ్విన్ కుమార్ (యాదాద్రి-భువనగిరి), డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎల్ఆర్డి భవానీ (సిరిసిల్ల) ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. డీసీఏ ప్రకారం.. తదుపరి విచారణలు నిర్వహించబడతాయి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఈ చట్టం కింద నేరస్తులకు ఆరు నెలల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
ప్రజా సలహా
నివాస, వాణిజ్య లేదా పారిశ్రామిక ప్రాంతాలలో మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల తయారీతో సహా డ్రగ్స్కు సంబంధించిన ఏవైనా అనుమానిత చట్టవిరుద్ధ కార్యకలాపాలను నివేదించాలని డీసీఏ ప్రజలను కోరింది. డీసీఏ యొక్క టోల్-ఫ్రీ నంబర్ 1800-599-6969 ద్వారా నివేదికలను చెప్పవచ్చు. అన్ని పని రోజులలో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్ రెడ్డి అధికారిక ప్రకటనలో.. చట్టానికి కట్టుబడి ఉండటం, తప్పుదోవ పట్టించే ప్రకటనలను నిరోధించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. మార్కెట్ను పర్యవేక్షించడంలో, ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో అడ్మినిస్ట్రేట్ అప్రమత్తంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.