హైదరాబాద్: రాష్ట్రంలో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నిన్న 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్, 5 జిల్లాల్లో 12 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత 5.8 డిగ్రీలు నమోదైంది. సంగారెడ్డి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్ జిల్లాల్లో చలి ప్రభావం తీవ్రంగా ఉంటోంది. రానున్న 3 రోజులు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
గురువారం (డిసెంబర్ 11, 2025) - శుక్రవారం ఉదయం మధ్య సంగారెడ్డిలోని కోహిర్లో అత్యల్పంగా 5.8°C నమోదైంది. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో చలి తీవ్రవ విపరీతంగా పెరిగింది. రంగారెడ్డిలోని మొయినాబాద్లో 6.0°C, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో 6.3°C, మేడ్చల్ మల్కాజ్గిరిలోని ఉప్పల్లో 7.1°C నమోదయ్యాయి. రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 11°C కంటే ఎక్కువ లేవు.
ఆదిలాబాద్, కుమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హనమకొండ, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు భారత వాతావరణ శాఖ గురువారం శీతల గాలుల హెచ్చరిక జారీ చేసింది. నగరం, దాని పరిసరాలు జాబితాలో లేనప్పటికీ, అవి రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రతలలో ఒకటిగా నమోదయ్యాయి.
డిసెంబర్ 11 నుంచి 12 ఉదయం మధ్య తెలంగాణ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు
సంగారెడ్డిలోని కోహిర్లో 5.8°C
రంగారెడ్డిలోని మొయినాబాద్లో 6.0°C
రంగారెడ్డిలోని హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో 6.3°C
మేడ్చల్ మల్కాజిగిరిలోని ఉప్పల్లో 7.1°C
హైదరాబాద్లోని మారేడ్పల్లిలో 10.1°C