తెలంగాణ సర్కార్‌ కీలక ప్రకటన.. సౌదీ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది.

By -  అంజి
Published on : 17 Nov 2025 5:09 PM IST

Telangana Cabinet, last rites, bus accident victims, Saudi Arabia, RS.5 lakh ex gratia, Hyderabad

తెలంగాణ సర్కార్‌ కీలక ప్రకటన.. సౌదీ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

హైదరాబాద్‌: సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. మంత్రి అజహరుద్దీన్‌, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనార్టీ విభాగం అధికారితో కూడిన ప్రతినిధుల బృందాన్ని ప్రభుత్వం సౌదీకి పంపించనుంది. మృతుల భౌతిక కాయాలకు మత సంప్రదాయం ప్రకారం.. అక్కడే అంత్యక్రియలు జరిపించనుంది. బాధిత కుటుంబాల నుంచి ఇద్దరు చొప్పున తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌ ఆదేశించారు.

సీఎం రేవంత్‌ అధ్యక్షత జరుగుతున్న మంత్రివర్గం సమావేశంలో.. సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ₹5 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని ప్రభుత్వం నిర్ణయించారు. మృతులకు సౌదీ అరేబియాలో వారి మతపరమైన ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని, ప్రతి కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి నుండి ఇద్దరు కుటుంబ సభ్యులను సౌదీ అరేబియాకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. మైనారిటీ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్, AIMIM నుండి ఎమ్మెల్యే, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారితో కూడిన అధికారిక ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీ అరేబియాకు పంపడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Next Story