హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా తిరిగి విమానం అత్యవసరంగా ఎయిర్ పోర్ట్ లో ల్యాండింగ్ అయింది. హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తున్న స్పేస్ జెట్ విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలెట్ వెంటనే ఆ విషయాన్ని అధికారులకు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే అత్యవసరంగా ల్యాండింగ్ కు ఏర్పాటు చేశారు. పైలట్ ఎంతో చాకచక్యంగా తిరుపతిలో ల్యాండ్ కావలసిన ఫ్లైట్ ను తిరిగి శంషాబాద్ ఏర్పాటుకు తీసుకువచ్చి క్షేమంగా ల్యాండ్ చేశాడు.
తిరుపతికి వెళ్లాల్సిన విమానం తిరిగి శంషాబాద్ కి రావడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ప్రత్యామ్నాయ ఫ్లైట్ ను ఏర్పాటు చేయాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేశారు. సాంకేతిక సమస్యపై స్పైస్ జెట్ యజమాన్యం ప్రయాణికులకు వివరణ ఇవ్వలేదు. దీంతో అసలు విమానం ఎందుకు ల్యాండింగ్ అయిందో ప్రయాణికులకు తెలియక తమకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. టేక్ ఆఫ్ అయినా కొన్ని నిమిషాలకే సాంకేతిక లోపాన్ని పైలెట్ గుర్తించడం తో పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో విమానంలో మొత్తం 80 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ 80 మందిని వేర్వేరు విమానాల్లో తిరుపతికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు