హైదరాబాద్: కొత్తగా భూ యాజమాన్య హక్కులకు పొందిన వారికి 'రైతు భరోసా' పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే దీనికి మరో 3 రోజుల గడువు మాత్రమే ఉంది. జూన్ 5 లోపు రిజిస్ట్రేషన్ అయి ఉంటే చాలని పేర్కొంది. ఏఈవోలకు పట్టాదారు, బ్యాంకు పాసు పుస్తకం, ఆధార్ జిరాక్స్ ఇస్తే పోర్టల్లో నమోదు చేస్తారని తెలిపింది. ఈ నెల 20 వరకు దరఖాస్తు గడువుగా పేర్కొంది. దరఖాస్తు చేసుకోని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.43 లక్షల అప్లికేషన్లు వచ్చినట్టు సమాచారం. వ్యవసాయ అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. పట్టాదారు పాస్బుక్ తోపాటు ఆధార్, బ్యాంక్ అకౌంట్ జిరాక్సులతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ముందుగా ఏఈవోలు, ఆ తర్వాత మండల వ్యవసాయ అధికారులు వాటిని పరిశీలిస్తారు. వాటి ఆధారంగా రైతుల అకౌంట్లలో డబ్బులు జమవుతాయి. అటు నిన్నటి వరకు 51.70 లక్షల మంది ఖాతాల్లో 'రైతు భరోసా' నిధులు రూ.3,902 కోట్లు జమ చేసింది.