తెలంగాణ కొత్తగా సీఎస్‌గా రామకృష్ణరావు..ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

By Knakam Karthik
Published on : 27 April 2025 6:37 PM IST

Telangana, Congress Governmenr, New Chief Secretary, Ramakrishna rao

తెలంగాణ కొత్తగా సీఎస్‌గా రామకృష్ణరావు..ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ట్రాన్స్‌ఫర్స్ జరిగాయి. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి ఈ నెల 30వ తేదీన పదవీవిరమణ చేయనున్నారు. 1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కె.రామకృష్ణ రావు ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

Next Story