రియల్‌ఎస్టేట్‌ బ్రోకర్‌ను కొట్టిన ఎంపీ ఈటలపై కేసు నమోదు

నారపల్లికి చెందిన గ్యారా ఉపేందర్ ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేశారు.

By అంజి
Published on : 22 Jan 2025 7:25 AM IST

Police, MP Etala Rajender, real estate broker, Medchal, Telangana

రియల్‌ఎస్టేట్‌ బ్రోకర్‌ను కొట్టిన ఎంపీ ఈటలపై కేసు నమోదు

హైదరాబాద్‌: నారపల్లికి చెందిన గ్యారా ఉపేందర్ ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేశారు. 126(2),115(2),352,351(2),ఆర్/డబ్ల్యూ 189(2),ఆర్/డబ్ల్యూ 191(2) బీఎన్‌ఎస్ యాక్ట్ కింద ఎంపీ ఈటల రాజేందర్‌, వై సుదర్శన్ రెడ్డి, శివారెడ్డి, బసవరాజు, జుబేర్ అక్రమ్‌ పై అభియోగాలు ఉన్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీలోని ఏకశిలానగర్‌లో ఉన్న తనపై ఎంపీ ఈటల రాజేందర్‌తో పాటు 30 మంది దాడి చేశారని ఉపేందర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోచారం ప్రాంతంలో నిరుపేద స్థానికులకు చెందిన భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు రావడంతో రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌తో గొడవపడ్డాడు.

నిన్న మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్‌లో ఈటల పర్యటించారు. ఇంటి స్థలాల యజమానులను ఇబ్బంది పెడుతున్నారని, దొంగ పేపర్లతో పేదల భూములు లాక్కుంటున్నారని ఫైర్‌ అయ్యారు. ఈక్రమంలోనే రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌పై చేయి చేసుకున్నారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరిపైనా చేయి ఎత్త లేదని, బూతులు తిట్టలేదని ఎంపీ ఈటల అన్నారు. కానీ పేదల భూములు కబ్జా అవుతున్నాయనే ఆవేదనతో, ధర్మాన్ని కాపాడేందుకు ఇవాళ పనిష్మెంట్‌ ఇచ్చానని తెలిపారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు అధర్మానికి కొమ్ము కాయడం సిగ్గుచేటన్నారు. ప్రస్తుత పరిస్థితులపై సీఎం స్వయంగా చర్యలు తీసుకుని, ప్రజల ఆస్తులు కాపాడాలని డిమాండ్‌ చేశారు.

Next Story