గుడ్‌న్యూస్ : ఉద్యోగులందరికీ రెండు నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించ‌నున్న‌ తెలంగాణ ప్రభుత్వం

Payment of 2 months prc arrears to government employees of telangana.తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Feb 2022 4:10 PM IST
గుడ్‌న్యూస్ : ఉద్యోగులందరికీ రెండు నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించ‌నున్న‌ తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ శుభ‌వార్త‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ రెండు నెలల పీఆర్సీ 2021 బకాయిలను చెల్లించనుంది. ఉద్యోగులకు ఏప్రిల్, మే 2021 పీఆర్‌సీ బకాయిల చెల్లింపునకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంగళవారం విడుదల చేసింది. ప్రభుత్వ రంగ, కార్పొరేషన్లు, సహకార సంఘాల పరిధిలోని అన్ని శాఖల ఉద్యోగులకు ప్రభుత్వం 2022 మే నుంచి 18 సమాన వాయిదాల్లో బకాయిలను చెల్లిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే మరణించిన ఉద్యోగుల పీఆర్సీ బకాయిలను వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని పేర్కొంది.

'ప్రభుత్వం పరిశీలించిన తర్వాత సవరించిన వేతనాలను చెల్లించాలని నిర్ణయించింది. 2020, 01.04.2021 నుండి 31.05.2021 వరకు ఉన్న‌ బకాయిలు ఏప్రిల్ నెల నుండి ప్రారంభమయ్యే పద్దెనిమిది సమాన నెలవారీ వాయిదాలలో చెల్లించే విధంగా నిర్ణ‌యం తీసుకుంది. ఉద్యోగి చనిపోతే కుటుంబం/చట్టపరమైన వారసులకు బకాయిలను ఏకమొత్తంలో చెల్లించాలి'' అని ఉత్తర్వుల్లో పేర్కొంది. మరింత సమాచారం కోసం.. ఉద్యోగులు goir.telangana.gov.in మరియు finance.telangana.gov.in/లో ప్రభుత్వ ఆర్డర్‌ను త‌నిఖీ చేయవచ్చు.

Next Story