తెలంగాణలో రూ.80 వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఎన్టీపీసీ

తెలంగాణలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులకు సుముఖంగా ఉన్నట్టు ఎన్టీపీసీ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి తెలియజేసింది.

By అంజి
Published on : 9 Aug 2025 5:22 PM IST

NTPC, invest, Telangana, Solar and wind power

తెలంగాణలో రూ.80 వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఎన్టీపీసీ 

తెలంగాణలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులకు సుముఖంగా ఉన్నట్టు ఎన్టీపీసీ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి తెలియజేసింది. ఎన్టీపీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయింది. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు ఎన్టీపీసీ సుముఖంగా ఉన్నట్లు ఈ సందర్భంగా ఆ ప్రతినిధి బృందం తెలిపింది.

ప్రధానంగా సోలార్, విండ్ విద్యుత్ ప్రాజెక్టుల్లో దాదాపు 80 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ వివరించారు. ఫ్లోటింగ్ సోలార్ ఉత్పత్తికి సంబంధించి రాష్ట్రంలో 6,700 మెగావాట్ల సామర్థ్యానికి అవకాశం ఉందని వివరించగా, రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం ఎన్టీపీసీకి అన్ని విధాలా సహకరిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Next Story