కేసీఆర్ చిన్న చూపు చూస్తున్నారు.. ఆ ఆలోచ‌న చేయాలి

MLA Jagga Reddy Fire On TRS Govt. ఆరోగ్య శ్రీ అమలు కావడం లేదని చెప్పిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్

By Medi Samrat  Published on  1 Oct 2022 1:15 PM GMT
కేసీఆర్ చిన్న చూపు చూస్తున్నారు.. ఆ ఆలోచ‌న చేయాలి

ఆరోగ్య శ్రీ అమలు కావడం లేదని చెప్పిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఆరోగ్య శ్రీ ప‌ట్ల‌ సీఎం కేసీఆర్ చిన్న చూపు చూస్తున్నారని.. ప్రతి మనిషి నీ బతికించే ఆలోచన ప్రభుత్వం చేయాలని కోరారు. పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ అమలు కాకపోవడం వల్ల అనేక కుటుంబాలు వైద్యం చేయించుకోలేక ఇబ్బందిపడుతున్నారని అన్నారు. 10 లక్షల బిల్లు అయితే సీఎంఆర్ఎఫ్ కేవలం 30 వేలే ఇస్తున్నారని.. ఇదే కాంగ్రెస్ హయాంలో ఆరోగ్య శ్రీ పూర్తిగా అమలు అయ్యేదని అన్నారు. 10 లక్షలు ఐతే కాంగ్రెస్ హయాంలో 8 లక్షలు సీఎంఆర్ఎఫ్ వచ్చేది.. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని వివ‌రించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో ఆలోచించి పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారు. తర్వాత సీఎం రోశయ్య, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా ఆరోగ్య శ్రీ బాగా అమలు అయింది. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో సైతం ప్రతి పేద వాడికి సీఎంఆర్ఎఫ్ డబ్బులు కూడా ఎక్కువ మొత్తంలో చెల్లింపులు జరిగాయి. ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కూడా ఆరోగ్య శ్రీ మీద దృష్టి పెట్టాలని కోరారు. ఆరోగ్య శ్రీ ప్రతి కార్పొరేట్ హస్పిటల్ లో అమలు అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. గతంలో ఇంటిలిజెన్స్ వాళ్ళు ప్రభుత్వ పరిపాలన పై ప్రజల్లో ఉన్న అభిప్రాయాల్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళేవారు. ప్రస్తుత ఇంటిలిజెన్స్ చీఫ్ ఎప్పుడైనా ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో సీఎం దృష్టికి తీసుకెళ్లిన సందర్భం ఏమైనా ఉందా..? ప్రస్తుతం ఇంటిలిజెన్స్ అంత.. ఏ లీడర్ ఎక్కడ పడుకున్నాడు.. ఏం చేస్తున్నారు అనే పనిలోనే పడ్డారు. ఇకనైనా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పూర్తిగా అమలు అయ్యేలా చూడాలి. ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, సీఎం కేసీఆర్ ఆరోగ్యశ్రీ అమలు పై ఫోకస్ చేసి అమలు చేయాలని కోరారు.


Next Story