బీసీల పట్ల మీ వక్రబుద్ధి మళ్లీ బయటపెట్టారు..టీబీజేపీ చీఫ్పై పొన్నం ఫైర్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
By Knakam Karthik
బీసీల పట్ల మీ వక్రబుద్ధి మళ్లీ బయటపెట్టారు..టీబీజేపీ చీఫ్పై పొన్నం ఫైర్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ మేరకు మంత్రి పొన్నం మాట్లాడుతూ..తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మరోసారి తన అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం అంటున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యమే. గతంలో పక్క రాష్ట్రం తమిళనాడులో జరిగింది. తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి. ఎందుకు రిజర్వేషన్లు అమలు కావో చూస్తాం. సుప్రీంకోర్టు లో ఇందిరా సహనీ కేసులో స్పష్టంగా చెప్పారు. రాష్ట్రాల దగ్గర ప్రామాణికమైన సమాచారం ఉంటే ఎంపెరికల్ డేటా ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి కేబినెట్ ఆమోదం, శాసన సభ ఆమోదం , గవర్నర్ ఆమోదంతో ఢిల్లీలో ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అంశం. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది బరాబర్ రిజర్వేషన్లు అధికారికంగా అమలు చేస్తాం..అని పొన్నం పేర్కొన్నారు.
ఆనాడు మండల కమిషన్ తీసుకొస్తే కమండల్ అన్నది మీరే. మళ్ళీ మీ యొక్క వక్ర బుద్ధిని బీసీల పట్ల కుట్రను బయటపెట్టారు. తెలంగాణలోని అన్ని బీసీ వర్గాలు, కుల సంఘాలు బీజేపీ నిజస్వరూపాన్ని గమనించి రినర్వేషన్లు ప్రక్రియను కాపాడుకునే దానిలో ముందుండాలని కోరుతున్నా. బీజేపీ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తప్పకుండా 9 వ షెడ్యూల్లో చేర్చాల్సిందే. గతంలో జనహిత అభియాన్ కేసులో ews సందర్భంగా స్పష్టంగా చెప్పింది. Ews ఇచ్చినప్పుడు 50 శాతం రిజర్వేషన్లు కాబ్ ఎత్తివేశారు. ప్రామాణిక నివేదిక ప్రకారం సమాచారం సుప్రీంకోర్టులో ఉంది. మభ్యపెడుతుంది మీరు.. ముఖ్యమంత్రి బీసీ అన్నది మీరు సీఎల్పీ నాయకుడు బీసీ ఇవ్వంది మీరు. పార్టీ అధ్యక్షు పదవి కూడా బీసీ లకు ఇవ్వని మీరు.. మండల వ్యతిరేకించిన మీరు బీసీ లకు వ్యతిరేకంగా ఫ్యూడల్ పార్టీ లో ఉన్నారు. సామాజిక న్యాయంతో కాంగ్రెస్తోనే సాధ్యం..సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. మా ముఖ్యమంత్రి రెడ్డి అయితే ఎస్సీ ఉప ముఖ్యమంత్రి మా పీసీసీ అధ్యక్షుడు బీసీ ఉన్నారు. మా వర్గాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం అని హెచ్చరిస్తున్నా..అని పొన్నం వ్యాఖ్యానించారు.