నానమ్మ జ్ఞాపకార్థంగా స్కూల్ భవన నిర్మాణం.. కేటీఆర్ ట్వీట్
Minister KTR laying foundation stone to govt school in konapur village.తన నానమ్మ వెంకటమ్మ జ్ఞాపకార్థంగా పాఠశాల
By తోట వంశీ కుమార్ Published on
10 May 2022 7:49 AM GMT

తన నానమ్మ వెంకటమ్మ జ్ఞాపకార్థంగా పాఠశాల భవనాన్ని నిర్మిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నానమ్మను స్మరించుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం గురించి ఆలోచించడం లేదన్నారు. నా గ్రామం – నా పాఠశాల కార్యక్రమం కింద తన సొంత ఖర్చులతో పాఠశాల భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. కామారెడ్డి జిల్లాలోని కోనాపూర్లో స్కూల్ భవనానికి ఈరోజు శంకుస్థాపన చేస్తున్నందుకు ఆనందంగా ఉందని ట్వీట్ లో కేటీఆర్ తెలిపారు.
Next Story