'ఆ ముగ్గురు అధికారులు ఏపీకి'.. రిలీవ్ చేయాలని తెలంగాణకు కేంద్రం ఆదేశం
తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులను విధుల నుంచి తప్పించాలని, అలాగే వారు 24 గంటల్లోగా వారి సొంత కేడర్ అయిన ఆంధ్రప్రదేశ్కు రిపోర్ట్ చేయాలని హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఆదేశించింది.
By న్యూస్మీటర్ తెలుగు Published on 22 Feb 2025 11:28 AM IST
'ఆ ముగ్గురు అధికారులు ఏపీకి'.. రిలీవ్ చేయాలని తెలంగాణకు కేంద్రం ఆదేశం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులను విధుల నుంచి తప్పించాలని, అలాగే వారు 24 గంటల్లోగా వారి సొంత కేడర్ అయిన ఆంధ్రప్రదేశ్కు రిపోర్ట్ చేయాలని హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఆదేశించింది. ఆంధ్రకు రిపోర్ట్ చేయమని అడిగిన అధికారులలో మాజీ డీజీపీ, తెలంగాణ రోడ్ సేఫ్టీ చైర్మన్ అంజని కుమార్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి, పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాషా బిష్ట్ ఉన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో కొంతమంది ఐపీఎస్ అధికారులకు సిబ్బంది & శిక్షణ శాఖ ఏపీ కేడర్ను కేటాయించింది. మార్చి 29, 2016న, హైదరాబాద్లోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంజని కుమార్, అభిలాష భిష్ట్, అభిషేక్ మొహంతి, డి. రోనాల్డ్ రోజ్, ఆమ్రపాలి కాట, మరో 7 మంది ఐఏఎస్ అధికారులను తెలంగాణ రాష్ట్రం/ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారు ఆ కేటాయింపును DOPT సవాలు చేశారు. ఆ తర్వాత వారు ఏపీకి వారి కేటాయింపుపై స్టే పొందారు.
#Telangana: Ministry of Home Affairs, has issued orders to relieve senior IPS officer and former DGP Anjani Kumar, IPS Abhilasha Bisht & IPS Abhishek Mohanty- Commissioner of Police Karimnagar. Three officials have been asked to report to their home cadres. pic.twitter.com/6bIMmybGMf
— NewsMeter (@NewsMeter_In) February 21, 2025
అయితే ఇప్పుడు.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కేడర్కు కేటాయించాలన్న ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి కాట అభ్యర్థనను తిరస్కరించారు. జీహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేస్తున్న ఆమ్రపాలి కటా ఆంధ్రప్రదేశ్కు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. డి. రోనాల్డ్ రోజ్ కూడా అదే విధిని ఎదుర్కొన్నారు. తెలంగాణ కేడర్ను కేటాయించాలన్న ఆమ్రపాలి కాటా విజ్ఞప్తిని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ తిరస్కరించింది.
తాజాగా ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందనే ఊహాగానాలు వచ్చినప్పటి నుంచి, వారిని విధుల నుంచి తప్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ శుక్రవారం హోంమంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ ముగ్గురు అధికారులు ఆర్డర్ అందిన 24 గంటల్లోపు ఆంధ్రప్రదేశ్కు రిపోర్ట్ చేయాలని కోరారు.