Medak: అల్పాహారంలో బల్లి.. మోడల్‌ స్కూల్‌లో 20 మంది విద్యార్థినిలకు అస్వస్థత

తెలంగాణలోని మెదక్ జిల్లా రామాయంపేటలోని టీజీ మోడల్ స్కూల్‌కు చెందిన 35 మంది విద్యార్థులు అల్పాహారం సేవించి అస్వస్థతకు గురయ్యారు.

By అంజి  Published on  10 July 2024 2:15 AM GMT
Medak, school students, sick, lizard, breakfast

Medak: అల్పాహారంలో బల్లి.. మోడల్‌ స్కూల్‌లో 20 మంది విద్యార్థినిలకు అస్వస్థత

హైదరాబాద్: తెలంగాణలోని మెదక్ జిల్లా రామాయంపేటలోని టీజీ మోడల్ స్కూల్‌కు చెందిన 35 మంది విద్యార్థులు అల్పాహారం సేవించి అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అల్పాహారం తీసుకున్న విద్యార్థులు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకోవడంతో దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉదయం విద్యార్థులకు ఇచ్చిన అల్పాహారంలో బల్లి పడడం గమనించి వెంటనే పాఠశాల కేర్ టేకర్ విద్యార్థులందరిని తినవద్దని హెచ్చరించారు. అప్పటికే అల్పాహారం తిన్న విద్యార్థులు వాంతులు, విరేచనాల బారిన పడ్డారు.

బల్లి ఉన్నట్లు ఆధారాలు కనుగొనబడలేదు, ఎందుకంటే విద్యార్థుల వద్ద ఫోన్‌లను ఉంచడానికి అనుమతించబడలేదు, కాబట్టి ఎటువంటి చిత్రాలు లేదా వీడియోలు తీయబడలేదు. నివేదికల ప్రకారం.. విద్యార్థులను వెంటనే రామాయంపేటలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. స్కూల్‌లో పనిచేసే వంట మనిషితో పాటు వంట సహాయకులను విధుల నుంచి తప్పించినట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి తెలిపారు.

ఇటీవల ఆహారంలో కీటకాలు, ఎలుకలు కనుగొనబడిన సంఘటనలు పెరిగాయి. హైదరాబాద్‌లోని గడ్డి అన్నారం రాఘవేంద్ర హోటల్‌లో తాను ఆర్డర్ చేసిన 'మసాలా పూరీ' చట్నీలో పురుగు కనిపించింది. కస్టమర్‌ చూపించిన వీడియోను పలువురు ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. ఇలాంటి మరో సంఘటనలో.. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ- హైదరాబాద్, సుల్తాన్‌పూర్‌లో చట్నీ పాత్రలో ఎలుక ఈదుకుంటూ కనిపించింది. అయితే విద్యార్థుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్న ఈ వీడియోపై అధికారులెవరూ స్పందించలేదు.

Next Story