అంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు, ఫైరింజన్లో నీళ్లు ఉంటే గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం తప్పదేని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. ఫైర్ బ్రిగేడ్కు సరైన మాస్కులు లేకపోవడంతో వాళ్లు లోపలికి వెళ్లి బాధితులను కాపాడుకోలేకపోయారన్నారు. 125 సంవత్సరాల నుంచి చార్మినార్ దగ్గర ఉంటున్న అగర్వాల్ కుటుంబంలో 17 మంది చనిపోవడం హైదరాబాద్ చరిత్రలోనే విషాదకరమని అన్నారు.
ఈ కుటుంబంలో జరిగిన విషాద ఘటన ఇంకొకరికి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్లో ఆక్సిజన్ మాస్క్ లేకుండా, ఫైర్ ఇంజన్లో నీళ్ళు లేకుండా ఘటనా స్థలానికి రావడం వల్లనే మా కుటుంబ సభ్యులను కోల్పోయామని బాధితులు చెప్తున్నారని కేటీఆర్ మీడియాతో చెప్పారు. అందాల పోటీల మీద పెట్టే ఖర్చు ప్రజల ప్రాణాలు కాపాడడానికి కూడా పెట్టాలని కోరారు. హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి బాధితులను పరామర్శించాలని కోరారు కేటీఆర్.