తెలంగాణ భవన్‌లో ఆ నేత‌ల‌తో కేటీఆర్ కీల‌క స‌మావేశం

KTR Held Meeting With TRS Leaders In Telangana Bhavan. మంత్రి కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో సమావేశం నిర్వహించారు.

By Medi Samrat  Published on  24 Feb 2021 7:51 AM GMT
KTR Held Meeting With TRS Leaders In Telangana Bhavan

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ప‌ట్ట‌భ‌ద్రుల‌‌ స్థానానికి సంబంధించిన ముఖ్య నేతలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.


ఈ స‌మావేశంలో హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ స్థానంపై పార్టీలోని ఎంతో మంది ఆశలు పెట్టుకున్నప్పటికీ పార్టీ అధినేత కేసీఆర్‌ అనూహ్యంగా పీవీ కుమార్తెను తెరపైకి తీసుకురావడం పట్ల రాజకీయంగా సంచలనంగా మారింది.


Next Story