ఖమ్మం భూదాన్ భూముల స్కామ్‌లో మరో నలుగురు అరెస్ట్

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల అక్రమ విక్రయాల కేసులో పోలీసులు వేట ముమ్మరం చేశారు

By -  Knakam Karthik
Published on : 23 March 2026 9:06 PM IST

Telangana, Khammam Land Scam, Bhoodan Lands, Telangana Police, SIT Investigation, Land Fraud

ఖమ్మం భూదాన్ భూముల స్కామ్‌లో మరో నలుగురు అరెస్ట్

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల అక్రమ విక్రయాల కేసులో పోలీసులు వేట ముమ్మరం చేశారు. ఈ భారీ కుంభకోణానికి సంబంధించి ఖానాపురం హవేలీ పోలీసులు సోమవారం మరో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిని కల్తీ రామచంద్రయ్య, బాణాల లక్ష్మణాచారి, చిప్పనపల్లి వీరయ్య, కుంజా కృష్ణయ్యగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 16 మందిని కటకటాల్లోకి నెట్టినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెల్లడించారు.

ప్రస్తుతం ఈ భారీ భూ దోపిడీపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) లోతుగా విచారణ జరుపుతోంది. భూ లావాదేవీల పేరుతో నిందితులు అమాయక ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని, ఆ సొమ్మును తిరిగి రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో మరో ఐదుగురు నిందితులు పోలెబోయిన ముత్తయ్య, బాలి శ్రీనివాస్, కొప్పెర వెంకన్న, కొట్టె బసు, సంపంగి వెంకటాచలంలను విచారించి, వారిని ఆదివారం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ స్కామ్‌లో మరికొందరు పెద్ద తలకాయల ప్రమేయం ఉండే అవకాశం ఉందన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story