ఎంబీబీఎస్‌ సీటు ఇప్పిస్తానని లక్షల్లో మోసం.. బీజేపీ నాయకుడు అరెస్ట్‌

Jangaon BJP leader promises MBBS seat to student, flees with Rs 48.53L. ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని చెప్పి విద్యార్థినిని రూ.48.53 లక్షలు మోసం చేసిన బీజేపీ నేతను రాచకొండ పోలీసులు అరెస్ట్

By అంజి  Published on  21 Sep 2022 4:16 AM GMT
ఎంబీబీఎస్‌ సీటు ఇప్పిస్తానని లక్షల్లో మోసం.. బీజేపీ నాయకుడు అరెస్ట్‌

ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని చెప్పి విద్యార్థినిని రూ.48.53 లక్షలు మోసం చేసిన బీజేపీ నేతను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తపల్లి సతీష్ కుమార్‌గా గుర్తింపు పొందిన ఆయన జనగాం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విఫలమయ్యారు. పోలీసులు అతనిపై ఐపీసీ సెక్షన్ 406, 420, 465, 468, 471 రీడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు. సతీష్‌ ఉప్పల్‌లో నివాసం ఉంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన కూతురికి మెడికల్‌ సీటు ఇప్పించాలంటూ సతీష్‌ను సంప్రదించాడు.

దీంతో 32 ఏళ్ల నిందితుడు కె సతీష్ కుమార్‌ను బాచుపల్లిలోని మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఫిర్యాదుదారుడి కుమార్తెకు MBBS సీటు ఇప్పిస్తానని రూ.48, 53,000 తీసుకున్నాడు. అయితే సతీష్‌ ఎంతకు మెడికల్‌ సీటు ఇప్పించలేదు. దీంతో డబ్బు కోసం బాధితురాలు ఒత్తిడి చేయడంతో నకిలీ కేటాయింపు ఉత్తర్వులు సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు రెండు చెక్కులను జారీ చేశాడు, ఖాతాలో తగినంత నిధులు లేకపోవడంతో అవి బౌన్స్ అయ్యాయి. దీంతో తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కె.సతీష్ కుమార్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Next Story