'మీకసలు జనగణమన ఆలపించే దమ్ముందా?'.. ఎంఐఎంకు బండి సంజయ్‌ సవాల్

ఎంఐఎం నేతలు నిజంగా దేశభక్తులే అయితే.. భాగ్యలక్ష్మి గుడికి వచ్చి జనగణమణ, వందేమాతరం గీతాలను ఆలపించాలంటూ బండి సంజయ్ ఛాలెంజ్ చేశారు.

By అంజి  Published on  1 Oct 2023 2:01 AM GMT
Karimnagar, Bandi Sanjay, AIMIM, patriotism

'మీకసలు జనగణమన ఆలపించే దమ్ముందా?'.. ఎంఐఎంకు బండి సంజయ్‌ సవాల్

తెలంగాణా బీజేపీ నాయకుడు బండి సంజయ్ సెప్టెంబర్ 30, శనివారం నాడు తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని తన కార్యాలయం వెలుపల నినాదాలు చేశారని ఏఐఎంఐఎం కార్యకర్తలు విమర్శించారు. ఎంఐఎం నేతలు భారతదేశం పట్ల దేశభక్తిని నిరూపించుకోవాలన్నారు. నివేదికల ప్రకారం.. బీజేపీ నాయకుడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ 50కి పైగా మోటర్‌బైక్‌ల ర్యాలీ ఆయన కార్యాలయం వెలుపల జరిగింది. కార్యాలయం వెలుపల ఏర్పాటు చేసిన బోర్డును ధ్వంసం చేసేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి.

ఈ నిరసనపై కరీంనగర్ ఎంపీ అయిన సంజయ్ స్పందిస్తూ.. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) కలిసి తెలంగాణను నాశనం చేసేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ''నిజమైన దేశభక్తులతో నిండిన ఏకైక పార్టీ బీజేపీ. వారు (AIMIM) ఎవరి పట్ల దేశభక్తిని ప్రదర్శిస్తున్నారు? భారత్ లేదా పాకిస్థాన్? హైదరాబాద్‌లోని పాతబస్తీకి పురోగతిని హామీ ఇచ్చాం. పాతబస్తీ మాదిరిగానే ఇప్పుడు మొత్తం ముస్లిం సమాజం బీజేపీకి మద్దతు పలుకుతోంది. వారు మా ట్రిపుల్ తలాక్ బిల్లును అభినందిస్తున్నారు'' అని ఆయన అన్నారు. బైక్ ర్యాలీకి బీఆర్‌ఎస్ కార్యకర్తలను అనుమతించడంపై సంజయ్ పోలీసులపై మండిపడ్డారు.

ఖాసిం రజ్వీ, నిజాం అనుచరులు కాకపోతే వారు నిజంగా దేశభక్తులైతే భాగ్యలక్ష్మి గుడి బయట కలుద్దాం. భారతదేశం పట్ల తమకున్న దేశభక్తిని నిరూపించుకోవడానికి జాతీయ గీతాన్ని ఆలపించాలని ఎఐఎంఐఎం కార్యకర్తలకు సవాలు విసిరారు. బీజేపీ కార్యకర్తలు ప్రజా సామరస్యం, శాంతిని కాపాడటానికి సిద్ధంగా ఉన్నారని సంజయ్ అన్నారు. పోలీసులపై ప్రజలకు నమ్మకం లేదు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నిర్దేశించిన రాజ్యాంగాన్ని [పోలీసులు], సీఎం కే చంద్రశేఖర్ రావు పాటించడం లేదని ఆయన అన్నారు. నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బీజేపీ కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

Next Story