సింగరేణిలో వారికి 50 శాతం శాలరీతో ప్రత్యేక సెలవులు

తీవ్ర కాలేయ వ్యాధి (లివర్ సిరోసిస్) బారినపడిన కార్మికులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది.

By Knakam Karthik
Published on : 24 April 2025 7:35 AM IST

Telangana, Singareni Employees, SCCL,

సింగరేణిలో వారికి 50 శాతం శాలరీతో ప్రత్యేక సెలవులు

తీవ్ర కాలేయ వ్యాధి (లివర్ సిరోసిస్) బారినపడిన కార్మికులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. 50 శాతం వేతనంతో ప్రత్యేక సెలవు మంజూరు చేయనున్నట్లు సింగరేణి యాజమాన్యం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ వెసులుబాటును ఏడు తీవ్ర వ్యాధులకు మాత్రమే వర్తింప చేస్తున్నారు. గుండె జబ్బు, క్షయ, క్యాన్సర్, కుష్టు, పక్షవాతం, మూత్ర కోశ వ్యాధులు, ఎయిడ్స్ , మెదడు వ్యాధులుకు ఈ స్పెషల్ లీవ్ ఇస్తున్నారు.

కాగా ఇటీవల కోల్ ఇండియా స్థాయిలో జరిగిన ఎన్సీడబ్ల్యూఏ 11వ వేతన ఒప్పందంలో లివర్ సిరోసిస్ (తీవ్ర కాలేయ వ్యాధి) బాధితులకు కూడా స్పెషల్ లీవ్ వర్తింపచేయాలని నిర్ణయించడంతో సింగరేణి యాజమాన్యం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తీవ్ర కాలేయ వ్యాధికి గురైన కార్మికునికి స్పెషల్ లీవు మంజూరు చేయవచ్చని, వ్యాధి నయమై, విధులకు ఫిట్ అయ్యేంతవరకు అతనికి 50 శాతం వేతన మొత్తం (బేసిక్ పే, వీడిఏ, ఎస్ డి ఏ లో 50 శాతం ) చెల్లించవచ్చని సర్క్యులర్ లో పేర్కొన్నారు.

Next Story