రాజ్యసభ అభ్యర్థులపై అధిష్టానానిదే తుది నిర్ణయం: టీపీసీసీ చీఫ్

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానానిదే తుది నిర్ణయమని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

By -  Knakam Karthik
Published on : 18 Feb 2026 9:20 PM IST

Telangana, TPCC Chief MaheshKumarGoud, Telangana Congress, JeevanReddy, RajyaSabha Election, BC Quota

రాజ్యసభ అభ్యర్థులపై అధిష్టానానిదే తుది నిర్ణయం: టీపీసీసీ చీఫ్

హైదరాబాద్: రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానానిదే తుది నిర్ణయమని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, పార్టీలో సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల పట్ల అధిష్టానం సంతృప్తిగా ఉందని, వార్డు మెంబర్లలో 67 శాతం, మేయర్ మరియు మున్సిపల్ చైర్మన్ పదవుల్లో 50 శాతం బీసీలకే కేటాయించామని ఆయన గుర్తుచేశారు.

రేపు జరగబోయే పార్టీ సమావేశంలో సంస్థాగత నిర్మాణం మరియు ప్రభుత్వం రెండేళ్ల పాలనపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. సీట్ల కేటాయింపు సర్వేల ఆధారంగా మరియు సభ్యుల సంఖ్యను బట్టే జరిగిందని, ఇందులో ఎలాంటి పక్షపాతం లేదని వివరించారు. రాజ్యసభ సీటును బీసీలకు ఇస్తారా లేదా అనే అంశంపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని, పార్టీ బలోపేతానికి అందరూ సహకరించాలని కోరారు.

Next Story