Narayanpet: తీవ్ర ఎండలు.. వడదెబ్బ తగిలి చిరుతపులి మృతి

నారాయణపేట జిల్లా మద్దూరు పరిధిలోని నందిపాడు - చింతల్‌కుంట గ్రామాల మధ్య ఉన్న వరి పొలాల్లో చిరుత కళేబరం కనిపించింది.

By అంజి  Published on  6 May 2024 1:21 AM GMT
Telangana, Heatwave , leopard, Narayanpet

Narayanpet: తీవ్ర ఎండలు.. వడదెబ్బ తగిలి చిరుతపులి మృతి

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా వడదెబ్బ మరణాలు నమోదవుతుండగా, వన్యప్రాణులు కూడా వేసవి తాపానికి బలి అవుతున్నాయి. నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని చిరుతపులి మృతి చెందింది. మద్దూరు పరిధిలోని నందిపాడు - చింతల్‌కుంట గ్రామాల మధ్య ఉన్న వరి పొలాల్లో చిరుత కళేబరం కనిపించింది. దీన్ని గుర్తించిన గ్రామస్తులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు.. చిరుత పులి రెండు రోజుల క్రితం మృతి చెంది ఉంటుందని తెలిపారు.

ఈ ప్రాంతంలో వృక్షసంపద లేకపోవడం వన్యప్రాణుల మనుగడకు పెద్ద సవాలుగా ఉందని నారాయణపేటకు చెందిన డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ వీన్ వాణి ఆందోళన వ్యక్తం చేశారు. మద్దూరు రెవెన్యూ భూమిలో కనీసం నాలుగు చిరుతలు నివాసం ఉంటున్నాయని తెలిపారు. మద్దూరు రెవెన్యూ భూమిలోని కొండల్లో ఎక్కడా మొక్కలు లేవని, ఎండవేడిమి కారణంగా చిరుతపులిలన్నీ కొట్టుకుపోతున్నాయని నారాయణపేట డీఎఫ్‌వో వీణ్ వాణి తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని అటవీశాఖ సెక్షణ్‌ అధికారి లక్ష్మణ్‌ చెప్పారు.

Next Story