తెలంగాణ బీర్ ప్రియులకు శుభవార్త
Good news for beer lovers in Telangana State. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా నిత్యావసర వస్తువులు, నూనెలు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నప్పటికీ,
By అంజి Published on 13 March 2022 6:03 AM GMT
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా నిత్యావసర వస్తువులు, నూనెలు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నప్పటికీ, మద్యంపై 17 శాతం కోవిడ్ సెస్ను తొలగించడం ద్వారా బీర్ ధరలను తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు కోవిడ్ సెస్ను రద్దు చేశాయి. బీర్ల అమ్మకాలు బాగా తగ్గడమే ఇలాంటి ప్రతిపాదనకు కారణం. ప్రభుత్వం జూలై 2021లో బీర్ ధరను రూ. 10 తగ్గించింది, కానీ ఇప్పటికీ డిమాండ్ పెరగలేదు. గోడౌన్లలో నిల్వలు పోగుపడ్డాయి. అయితే ధరలను తగ్గించడం, కోవిడ్ సెస్ను తొలగించడం వంటి ప్రతిపాదిత చర్య స్టాక్లను క్లియర్ చేయడంలో సహాయపడుతుందని, వేసవి ప్రారంభమైనందున అమ్మకాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
లైసెన్స్ పొందిన రిటైల్ మద్యం, బార్ షాప్ డీలర్లకు మార్చి చివరి నుండి బీర్ అమ్మకాలను పెంచడానికి వేసవి ఆఫర్లను ప్రకటించే స్వేచ్ఛ ఇవ్వబడిందని ఎక్సైజ్ ప్రొహిబిషన్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం బార్లో బాటిల్ బీరు రూ.180 నుంచి రూ.200 పలుకుతుండగా.. రూ.20 నుంచి రూ.30 వరకు తగ్గుతుందని, టిన్నుల్లో ప్యాక్ చేసిన బీరు ధర అలాగే ఉంటుందని అధికారులు తెలిపారు. వేసవి కాలంలో బీరుకు డిమాండ్ పెరుగుతుంది. ఈ చర్యలతో విక్రయాలు రెట్టింపు అవుతాయని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.