హైదరాబాద్‌లో రూ.5లకే బ్రేక్ ఫాస్ట్..GHMC స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం

ఇందిరా క్యాంటీన్లలో 5 రూపాయల భోజనంతో పాటు బ్రేక్ ఫాస్ట్ (టిఫిన్) అందించేందుకు కూడా స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.

By Knakam Karthik
Published on : 27 Jun 2025 7:30 AM IST

Hyderabad News, GHMC, Annapurna centres, Indira Canteens, Breakfast

హైదరాబాద్‌లో రూ.5లకే బ్రేక్ ఫాస్ట్..GHMC స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం

హైదరాబాద్‌ సిటీలో అన్నపూర్ణ కేంద్రాలను ఇందిరా క్యాంటీన్లుగా రీబ్రాండ్ చేయడానికి జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అన్నపూర్ణ కేంద్రాల వద్ద రూ.5కే భోజనం లభించేది. కాగా ఈ అన్నపూర్ణ కేంద్రాలకు ఇందిరా క్యాంటీన్లు పేరు మార్చేందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.

అయితే ఇప్పటివరకే అన్నపూర్ణ క్యాంటీన్లలో మధ్యాహ్న భోజనం మాత్రమే పెడుతున్నారు. ఇక నుంచి ఇందిరా క్యాంటీన్లలో 5 రూపాయల భోజనంతో పాటు బ్రేక్ ఫాస్ట్ (టిఫిన్) అందించేందుకు కూడా స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. అదే విధంగా భోజన కేంద్రాలకు పర్మనెంట్ ప్లేస్, నిర్మాణాల పునరుద్ధరణ కు కమిటీ ఆమోదం తెలిపింది. ఇక నగరంలో ఉన్న టాయిలెట్లను పే అండ్ యూజ్ పద్ధతిలో నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది.

Next Story