భారతదేశంలోని ప్రముఖ డ్రోన్ కంపెనీ గరుడ ఏరోస్పేస్, తెలంగాణలోని నాగర్ కర్నూల్ లోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ కూలిపోవడంతో జరుగుతున్న కీలకమైన రెస్క్యూ ఆపరేషన్ లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) కు మద్దతుగా తమ కన్స్యూమర్ డ్రోన్, ద్రోణిని మోహరించింది.
అధిక మొత్తంలో నీరు మరియు బురద చేరుకోవటం కారణంగా రెస్క్యూ ప్రయత్నం తీవ్ర అడ్డంకులను ఎదుర్కొంటోంది, ఇది చాలా పరిమిత దృశ్యమానతతో ప్రమాదకర వాతావరణాన్ని సృష్టిస్తుంది. గరుడ ఏరోస్పేస్ డ్రోన్లను మ్యాపింగ్ మరియు వ్యూహాత్మక రెస్క్యూ ప్లానింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. సవాలుతో కూడిన పరిస్థితుల మధ్య చిక్కుకున్న కార్మికులను గుర్తించడంలో కూడా ఇది సహాయపడుతుంది , చాలా తక్కువ దృశ్యమానత ఉన్నప్పటికీ సొరంగం లోపలి భాగాన్ని స్పష్టమైన రీతిలో చిత్రించటం, నిజ-సమయ వీడియో ఫీడ్లను ప్రసారం చేయటం చేస్తున్నారు.
గరుడ ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ అగ్నిశ్వర్ జయప్రకాష్ NDRF కు మద్దతు ఇవ్వడం పట్ల మాట్లాడుతూ “మా డ్రోన్లు సవాలుతో కూడిన వాతావరణంలో కీలకమైన డేటాను అందించడానికి రూపొందించబడ్డాయి. సొరంగం లో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి NDRF ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాము. మేము NDRF తో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి కాదు. విపత్తు ప్రతిస్పందన కార్యకలాపాలలో మా డ్రోన్లు నిరంతరం తమ సామర్థ్యాలను నిరూపించుకున్నాయి" అని అన్నారు
వ్యవసాయం, పారిశ్రామిక తనిఖీలు మరియు విపత్తు నిర్వహణతో సహా వివిధ రంగాలలో డ్రోన్ పరిష్కారాలను అందించడంలో నైపుణ్యానికి పేరుగాంచిన గరుడ ఏరోస్పేస్, సమాజ ప్రయోజనం కోసం సాంకేతికతను ఉపయోగించుకుంటూనే ఉంది. అస్సాం మరియు ఆంధ్రప్రదేశ్లలో వరదల సమయంలో అవసరమైన సామాగ్రిని అందించడానికి కంపెనీ గతంలో NDRF తో కలిసి పనిచేసింది.