మళ్లీ మూతపడ్డ గడ్డి అన్నారం మార్కెట్‌

Gaddi Annaram market in Hyderabad closed again. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో మూడు రోజుల క్రితం తెరిచిన గడ్డి అన్నారం మార్కెట్‌ను మంగళవారం ఉదయం

By అంజి  Published on  8 March 2022 12:20 PM IST
మళ్లీ మూతపడ్డ గడ్డి అన్నారం మార్కెట్‌

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో మూడు రోజుల క్రితం తెరిచిన గడ్డి అన్నారం మార్కెట్‌ను మంగళవారం ఉదయం మళ్లీ మూసివేశారు. ఏప్రిల్ 6 వరకు మార్కెట్‌ను తెరిచి ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. అయితే అధికారులు మార్కెట్‌ను మూసివేయడానికి ప్రయత్నించారు, దీంతో వ్యాపారులు అధికారులపైకి రావడంతో మార్కెట్ వద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది. లారీల్లో వచ్చిన పండ్లను కూడా అధికారులు బాట సింగారం తరలించారు. అంతకుముందు, వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. మార్కెట్‌ను తిరిగి తెరవాలని కోర్టు ఆదేశించడంతో మార్కెట్‌ను మూసివేయకుండా అధికారులను ఆపడానికి ప్రయత్నించినప్పుడు పోలీసు అధికారులు తమపై లాఠీఛార్జ్ చేసారని ఫిర్యాదు చేశారు.

మార్కెట్‌ను పునఃప్రారంభించాలని అధికారులను డిమాండ్ చేస్తూ వ్యాపారులు నిరసనకు దిగారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ మార్కెట్‌ను ఎలా మూసివేస్తారని ప్రశ్నించారు. మార్కెట్‌ను రైతులకు, వ్యాపారులకు అప్పగించాలని హైకోర్టు అధికారులను ఆదేశించిందని, వారికి షెడ్లు కూడా నిర్మించాలని ఆదేశించిందని వ్యాపారి ఒకరు ఆరోపించారు. అయినా అధికారులు ఏమీ చేయలేదన్నారు. రైతులతో సహా దాదాపు 95 మంది వ్యాపారులు ఉన్నందున బాట సింగారం వద్ద మార్కెట్‌ను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్థలం వ్యాపారులకు సరిపోదని అన్నారు.

Next Story